బాలీవుడ్ న్యూస్- సినిమా రంగంలో వదంతులు చాలా సహజం. పలానా హీరోతో, పలానా హీరోయిన్ కు ప్రేమాయణం సాగుతోందని, ఆ హీరోకు, ఈ హీరోయిన్ కు మధ్య ఏదో జరుగుతోందని, వాళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని.. ఇలా రకరకాల రూమర్స్ వస్తుంటాయి. ఇందులో కొన్ని మాత్రమే నిజమైతే, చాలా వరకు కేవరం పుకార్లేనని చెప్పాలి.
సినిమా నటీ, నటులుంటే అందరికి వారి గురించి తెలుసుకోవాలన్న ఆత్రుత ఉంటుంది కాబట్టి ఇలాంటి రూమర్స్ తొందరగా వైరల్ అవుతుంటాయి. అందులోను ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినిమా స్టార్స్ పై వదంతులు చాలా వేగంగా ప్రచారం అవుతున్నాయి. ఇదిగో ఇలాగే ఓ హీరోయిన్, బాలీవుడ్ నిర్మాత కొడుకుతో ప్రేమలో పడిందన్న చర్చ మొదలైంది.
అడవి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా హీరోయిన్ సాయి మంజ్రేకర్ లవ్ లో పడిందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ తనయుడు సుభాన్ నడియాద్వాలాతో సాయి మంజ్రేకర్ డేటింగ్ చేస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన హీరోయిన్ సాయి మంజ్రేకర్ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేసింది.
చిన్ననాటి నుంచే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది సాయి మంజ్రేకర్. ఇలాంటి అసత్య ప్రచారంపై ఎలా స్పందించాలో కూడా తనకు అర్థం కావడం లేదని చెప్పింది. తనతో సుభాన్ డేటింగ్ అంటూ వస్తున్న కథనాల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. చిన్నప్పటి నుంచే తనమీద పుకార్లు పుట్టించడం కామన్ అయిపోయిందని వాపోయిన సాయి మంజ్రేకర్ తనేంటో తన ఫ్యామిలీకి, సన్నిహితులకు తెలుసని చెప్పుకొచ్చింది.