హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలను వరదలు ముంచెత్తాయి. ధర్మశాలలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో నగరాన్ని భారీ వరద ముంచెత్తింది. ప్రజలు ఎత్తైన భవనాల మీదకు ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కుంభవృష్టికి కొండల మీది నుంచి వరద ఉప్పొంగింది. ఇటు భాగ్సు నాగ్ నాలా ఉప్పొంగి నగరంలోకి వరద నీరు ముంచెత్తింది. వరద ధాటికి పలు ఇళ్లు కూలిపోయాయి. పారిశుద్ధ్య కార్మికుల గుడారాలు., కార్లు సైతం కాగితపు పడవల్లా వరదల్లో కొట్టుకుపోయాయి. ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. మాంఝీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గుడిసెలు, దుకాణాలు నాశనమయ్యాయి. సిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో దారి మూసుకు పోయింది.
గత ఐదేళ్లుగా తమకు మంచి ఇళ్లు కట్టించాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు వరదల్లో వారు సర్వం కోల్పోయారు. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటు భాగ్సు నాగ్ ప్రాంతంలో వందలాది మంది వరదల్లో చిక్కుకుని సాయం కోసం పడిగాపులు కాస్తున్నారు.
#HimachalPradesh: #Flashflood in Bhagsu Nag, due to heavy rainfall in #Dharamshala https://t.co/Pd4bx18wHw pic.twitter.com/Za3J70JJFe
— Ayushi Agarwal (@ayu_agarwal94) July 12, 2021