హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలను వరదలు ముంచెత్తాయి. ధర్మశాలలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీంతో నగరాన్ని భారీ వరద ముంచెత్తింది. ప్రజలు ఎత్తైన భవనాల మీదకు ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కుంభవృష్టికి కొండల మీది నుంచి వరద ఉప్పొంగింది. ఇటు భాగ్సు నాగ్ నాలా ఉప్పొంగి నగరంలోకి వరద నీరు ముంచెత్తింది. వరద ధాటికి పలు ఇళ్లు కూలిపోయాయి. పారిశుద్ధ్య కార్మికుల గుడారాలు., కార్లు సైతం కాగితపు పడవల్లా వరదల్లో కొట్టుకుపోయాయి. […]