శారీరక, ఆర్థిక పరమైన సంబంధాలు ఎంతటి దారుణానికి దారి తీయొచ్చునని విశాఖ పట్నంలో జరిగిన కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య ఉదంతం తెలియజేస్తుంది. ఈ హత్య కేసులో ట్విస్టులు చూస్తే మతి పోవాల్సిందే. భార్య శివానీనే అతడిని హత్య చేసి.. ఏమీ ఎరగని
శారీరక, ఆర్థిక పరమైన సంబంధాలు ఎంతటి దారుణానికి దారి తీయొచ్చునని విశాఖ పట్నంలో జరిగిన కానిస్టేబుల్ బర్రి రమేష్ హత్య ఉదంతం తెలియజేస్తుంది. ఈ హత్య కేసులో ట్విస్టులు చూస్తే మతి పోవాల్సిందే. భార్య శివానీనే అతడిని హత్య చేసి.. ఏమీ ఎరగని నంగనాచీలాగా భర్త గుండెపోటుతో చనిపోయాడంటూ కుటుంబ సభ్యులను, బంధువులను మభ్యపెట్టేందుకు చూసింది. చివరకు శివానీ పన్నిన వలలో ఆమెనే పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆమె గుట్టురట్టు చేశారు. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఈ వగలాడి.. అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు భారీ స్కెచ్ వేసింది. అందుకోసం సుఫారీ కూడా ఇచ్చింది. చివరకు భర్తను చంపే ముందు కూడా ప్రియుడి.. ఆమె ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
విశాఖలో సంచలనం కలిగించిన కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. బర్రి రమేష్ వైజాగ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతడికి శివజ్యోతి అలియాస్ శివానీతో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో శివానీ ట్యాక్సీ డ్రైవర్ రామారావుతో పరిచయం ఏర్పడింది. ఆ చనువు కాస్త శారీరక సుఖానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించాడు. పలుమార్లు దొరికిపోవడంతో ఒకానొక దశలో అతడితో వెళ్లిపోమ్మని కూడా చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే పెళ్లికి కట్నం కింద ఇచ్చిన అర ఎకరాల పొలంతో పాటు అతడి అడ్డు తొలగించుకుంటే ఇక తమను ఎవ్వరూ ప్రశ్నించేది లేదని భావించి.. అతడిని కాటికి పంపేందుకు ప్రియుడు రామారావుతో కలిసి కుట్ర పన్నింది. భర్తను లేపేసేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయల సుఫారీ ఇచ్చారు. తన బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రియుడికి రూ. లక్షన్నర ఇచ్చింది.
అనుకున్నట్లుగానే ఈ నెల 1న ఇంటికి ప్రియుడ్ని పిలిచి, ఇద్దరూ ప్రణాళికను అమలు చేశారు. రమేష్ కు మద్యం తాగించి.. వాటిని వీడియోలు తీసింది. రమేష్ పడుకునేంత వరకు ప్రియుడ్ని ఇంటి కిందే ఉంచిన వయ్యారి.. పడుకున్నాక ఇంట్లోకి రమేష్, నీలాలను పిలిచింది. అనంతరం రమేష్ మొహంపై దిండు పెట్టి బలంగా నొక్కారు రామారావు అతడి స్నేహితుడు. ఆమె కాళ్లు పట్టుకుంది. అలాగే ఆ మొత్తం సంఘటనను కూడా వీడియో తీసింది. తెల్లారేసరికి పడి ఉన్నాడని, గుండె పోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులకు చెప్పింది. ఇక అంత్యక్రియలకు కూడా హడావుడి పెడుతుండటంతో.. రమేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన అన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహానికి పోస్టుమార్టం తరలించగా.. ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. తమకు అడ్డుగా ఉన్నాడని, ఆస్తి కోసం హత్య చేసినట్లు శివానీ అంగీకరించింది.
మరోవైపు శివాని చేసిన రీల్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. https://t.co/AJFKZrmA8Q pic.twitter.com/86woAc6Iao
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2023