మూడుముళ్ల బంధంతో, కొంగొత్త ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టింది శిరీష. కొత్తగా వచ్చిన కోడలికి జరగాల్సిన రాచ మర్యాదలు జరిగాయి. కొత్తగా పెళ్లైన మోజు కదా.. భార్య పట్ల విపరీతమైన ప్రేమ కురిపించాడు భర్త. ఆ ప్రేమకు ఫిదా అయిపోయింది భార్య.
మూడుముళ్ల బంధంతో, కొంగొత్త ఆశలతో అత్తారింట్లోకి అడుగుపెట్టింది శిరీష. కొత్తగా వచ్చిన కోడలికి జరగాల్సిన రాచ మర్యాదలు జరిగాయి. కొత్తగా పెళ్లైన మోజు కదా.. భార్య పట్ల విపరీతమైన ప్రేమ కురిపించాడు భర్త. ఆ ప్రేమకు ఫిదా అయిపోయింది భార్య. అంతలో వారి ప్రేమకు గుర్తుగా బంగారం లాంటి పాప పుట్టింది. అనంతరం ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ప్రిపేర్ అయ్యింది. గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శిగా నియమితురాలు అయ్యింది. ఆ సమయంలో అండగా నిలవాల్సిన భర్త ఆమె పాలిట శత్రువుగా మారాడు. నిత్యం ఆమెను అనుమానిస్తూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. వీరికి తోడు అత్తారింటి బంధువులు రాబంధువుల్లా పొడుచుకుతిన్నారు. దీంతో బాధను తట్టుకోలేక శిరీష తీవ్ర నిర్ణయం తీసుకుంది.
అత్తారింటి బాధలను తట్టుకోలేక పుట్టింట్లో ఆత్మహత్యకు ఒడిగట్టింది సచివాలయ ఉద్యోగి శిరీష. ఇంతకు ఆ బాధితురాలి ఊరు ఏదంటే కృష్ణా జిల్లాలోని నూజివీడు. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్లకు చెందిన గద్దల వెంకటేశ్వరరావుతో 2018 ఆగస్టులో శిరీషకు వివాహమైంది. మొదట్లో సంసారం సజావుగా సాగిపోయినా.. ఆ తర్వాత ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పాప పుట్టాక.. 2019లో నున్న సచివాలయం-1లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది. అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే అనుమానంతో భార్యను వేధిస్తుండటంతో పలుమార్లు గొడవలు జరగ్గా.. పెద్దలు సర్ది జెప్పి పంపారు. మళ్లీ కలిసి జీవిస్తున్నారు.
మూడు రోజుల క్రితం మరోసారి ఆమెపై దాడి చేశాడు. తలపై కొట్టడంతో ఆమెకు గాయలయ్యాయి. దీంతో ఆమె ఒక్కటే పుట్టింటికి వచ్చింది. పాపను తెమ్మని అన్నను పంపగా.. భర్త ఇవ్వలేదు. దీంతో మనస్థాపానికి గురై.. నాలుగు పేజీల ఆత్మహత్య లేఖ రాసి.. ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు తన భర్తతో పాటు అత్తమామలు, ఆడబిడ్డ, చిన్న అత్తలు కారణమని లెటర్లో పేర్కొంది. మంగళవారం ఉదయం 6 గంటలకు ఆమె గదిలోకి అన్నవెళ్లి చూడగా.. ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సూసైడ్ లేఖ ఆధారంగా, అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.