దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రెండు హత్యలు యావత్త్ భారతావని ఉలిక్కిపడేలా చేశాయి. జిమ్ లో ఏర్పడ్డ పరిచయం.. చనువుగా మారి.. 23 ఏళ్ల యువకుడు.. 42 ఏళ్ల మహిళను పాయింట్ గన్ రేంజ్లో ఆమెను తన ఇంటి వెలుపలే కాల్చి చంపి.. అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రెండు హత్యలు యావత్త్ భారతావని ఉలిక్కిపడేలా చేశాయి. జిమ్ లో ఏర్పడ్డ పరిచయం.. చనువుగా మారి.. 23 ఏళ్ల యువకుడు.. 42 ఏళ్ల మహిళను పాయింట్ గన్ రేంజ్లో ఆమెను తన ఇంటి వెలుపలే కాల్చి చంపి.. అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతలోనే మరో ఘటన వెలుగుచూసింది. శుక్రవారం ఓ విద్యార్థిని పార్కులో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. హత్య అని తేలింది. అయితే ఆ హత్య వెనుక తొలుత కారణాలు తెలియరాలేదు. తాజాగా ఈ కేసులో ట్విస్టు నెలకొంది. సోదరుడు వరుసయ్యే వ్యక్తి ఆమెను చంపినట్లు తేలింది. ఈ హత్యకు దారి తీసిన అంశమేమిటంటే.. అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడమే.
తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందన్న అక్కసుతో సోదరి వరుసయ్యే మహిళను దారుణంగా చంపేశాడు యువకుడు. సమాచారం అందుకు పోలీసులు బాధితురాలిని నర్గీస్గా, హంతకుడిని ఇర్ఫాన్గా గుర్తించారు. హత్య చేశాక పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్గీస్, ఇర్ఫాన్ అక్కాచెళ్లెల్ల పిల్లలు. 25 ఏళ్ల నర్గీస్.. కమలా నెహ్రు కాలేజీ చదువు పూర్తి చేసి.. మాల్వీయా నగర్లో స్టెనోగ్రాఫర్ కోర్సు నేర్చుకుంటుంది. ఇర్ఫాన్(28) ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పని చేస్తున్నాడు. నర్గీస్ను ఇష్టపడ్డ అతడు పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే అందుకు నర్గీస్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. నర్గీస్ కూడా ఫోన్ మాట్లాడకపోవడం, దూరంగా పెట్టడంతో తనకు దక్కని ఆ అమ్మాయి.. మరెవ్వరికీ దక్కకూడదని భావించి.. చంపేయాలని ప్లాన్ వేశాడు.
ఆమె ప్రతి రోజు నర్గీస్ తన స్టెనోగ్రఫీ క్లాస్ నుండి తిరిగి వస్తూ పార్కు నుండి ఇంటికి వెళుతుందని తెలుసుకున్న ఇర్ఫాన్ మూడు రోజుల క్రితమే హత్యకు ప్లాన్ చేశాడు. శుక్రవారం మధ్యాహ్నం కూడా పార్క్ గుండా వెళుతున్న నర్గీస్ను ఇర్ఫాన్ పిలిచాడు. మాట్లాడాలని పిలవగా.. నిరాకరించడంతో బ్యాగ్లో తెచ్చుకున్న ఇనుప రాడ్ తీసి ఆమెపై దాడి చేశాడు. చనిపోయాక అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు పార్క్కు వెళ్లి చూడగా.. మృతదేహంతో పాటు ఇనుపరాడ్ కనిపించింది. పరారైన ఇర్ఫాన్ పోలీసులకు లొంగిపోయాడు. ఢిల్లీలో జరిగిన రెండు ఘటనలను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ సీరియస్గా తీసుకున్నారు. ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.