పద్మ అవార్డ్స్.. వివిధ రంగాలలో దేశానికి విశిష్టత సేవ చేసే వారికి కేంద్రం ప్రభుత్వం ఈ అవార్డ్స్ అందిస్తుంటుంది. విద్య, వైద్య, క్రీడా, వినోదం, సాంఘికం, సాంస్కృతికం, సేవా, సంగీతం వంటి అన్నీ రంగాల్లో మహానుభావులను గుర్తించి, వారిని సన్మానించుకోవడానికి ఈ అవార్డ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ఏటా ఇలాంటి వారిని ఎంపిక చేసి గౌరవించుకోవడం వల్ల సమాజంలోని మిగతా వారికి స్ఫూర్తి నింపినట్టు అవుతుంది. సామాజిక బాధ్యత పెంచినట్టు అవుతుంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డ్స్ ని అందిస్తుంటుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్రం దరఖాస్తులు కోరుతుంది. వాటిని మళ్ళీ వెరిఫై చేసి తగిన వాళ్ళకి పద్మ అవార్డ్స్ అందిస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా కేంద్రం వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు దరఖాస్తులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. ఈ ప్రముఖులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. సెప్టెంబర్ 15 వరకూ ఆన్లైన్ పోర్టల్ padmaawards.gov.inలో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్రహోంశాఖ శుక్రవారం ఒక లేఖను పంపించింది. దీంతో.., ఈసారి తెలుగు రాష్ట్రాలలో పద్మ అవార్డ్స్ ఎవరిని వరిస్తాయోనన్న క్యాలిక్యులేషన్స్ అప్పుడే మొదలయ్యాయి. ఇక ఈ అవార్డ్స్ విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాలకి కేంద్రం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాదికి గాను పద్మ అవార్డులను ప్రకటించినప్పుడు కూడా ఈ విషయం రుజువైంది. అప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం నలుగురికి మాత్రమే పద్మ అవార్డులు లభించాయి. వీటిలో ఒక్కటి కూడా పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డు లేదు. నలుగురికి కూడా పద్మశ్రీతో మాత్రమే సరిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ నుండి అన్నవరపు రామస్వామి, నిడుమోలు సుమతి, అసవాది ప్రకాశ్రావుకి, తెలంగాణ నుండి శ్రీ కనకరాజుకు మాత్రమే పోయినసారి అవార్డ్స్ దక్కాయి. మరి.., ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వానికి తెలుగు జాతి పద్మాల విలువ సరిగ్గా అర్ధం అవుతుందో లేదో చూడాలి. మరి.., పద్మ అవార్డ్స్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.