ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతిచెందడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. 2009 సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోవడంతో అశేష ఆంధ్రావని దుఃఖసాగరంలో మునిగిపోయింది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి చిత్తూరు జిల్లాకు వెళుతూ.. నల్లమల అటవీప్రాంతంలోని పావురాలగుట్ట దగ్గర జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయన మృతి వార్త విన్న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రజలు కన్నీరు మున్నీరు అయ్యారు. రాజన్నా ఇక నీవు లేవా.. రావా అంటూ ఆవేదనతో కుంగిపోయారు.
వైఎస్ఆర్ ఆత్మ బంధువుగా పేరు తెచ్చుకున్న కెవిపి రామచంద్రరావు ఆ సమయంలో ఎలాంటి ఆవేదనకు గురయ్యారు.. వైఎస్ఆర్ కుటుంబానికి.. ఆయన అభిమానులకు ఈ విషాద వార్త ఎలా చెప్పి ఓదార్చారు.తాజాగా సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ ఈ విషయంలో కెవిపి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ‘‘వైఎస్ఆర్ బయలుదేరిన హెలికాఫ్టర్ కనిపించడం లేదు అన్న వార్త విన్నపుడు.. మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది. మీకు ఈ విషయం ఎవరు ముందుగా చెప్పారు.. అని ప్రశ్నించారు’’ దీనికి.. కెవిపి ఉద్వేగానికి లోనైన సమాధానం ఇచ్చారు.
వై.ఎస్.. మరణ వార్త విన్న తర్వాత ఆ బాధ మాటల్లో చెప్పలేను.. వైఎస్ కుటుంబానికి, పార్టీ శ్రేణులకు, అభిమానులను ఎలా సమాధాన పర్చాలి అన్న ఆలోచనలతో సతమతమయ్యాను. తన దుఖాఃన్ని అధిగమించి వీళ్లందరిని ఎలా సముదాయించుకోవాలన్న బాధతోనే ఉన్నాను. సోనియాగాంధీ అలాంటి వాతావరణ పరిస్థితిలో ఎలా పంపించారు అని సీరియస్ అయ్యాను. ఆయన బతికే ఉన్నారని.. తిరిగి వస్తారని ఏక్కడో ఆశ ఉన్నా.., చిఫ్ సెక్రటరీ, సెంట్రల్ హూం మినిస్టర్, డిజాస్ట్రర్ మేనేజ్ మెంట్ వాళ్లతో మాట్లాడిన తర్వాత ఆయన మరణించారన్న క్లారిటీకి వచ్చాను
ఆ సమయంలో వివిధ ఛానల్స్, పత్రికల్లో రక రకాల కథనాలు వచ్చాయి.. అవన్నీ కేవలం వైఎస్ రాజశేఖర్ మీద ఉన్న అభిమానం.. ఆయన బతికి ఉంటే బాగుంటుందన్న భావన వల్ల వచ్చినవే” అని కెవిపి తెలియచేశారు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. వైఎస్సార్ మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.