బుధవారం బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఓ కాల్పుల ఘటన రాష్ట్ర ప్రజలకు భయాందోళనలు కలిగిస్తుంది. పాట్నాలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో సుహాగన్ జ్యువెలర్స్ యజమాని రాజేష్ కుమార్ పై దుండగులు కాల్పులు జరిపి గాయపరిచారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నంబర్ 16లో రాజేష్ కుమార్ సుహాగన్ జ్యువెలర్స్ నడుపుతున్నాడు. బుధవారం దుండగులు కాల్పులు జరపి పారిపోగా రాజేష్ అక్కడికక్కడే నేలపై పడిపోయాడు. హుటాహుటిన స్థానికులు చికిత్స నిమిత్తం రాజేష్ ను రూబన్ ఆసుపత్రికి తరలించారు.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే దుండగుల కోసం గాలింపు కూడా ముమ్మరం చేశారు. రాజేష్ బంధువులు మాట్లాడుతూ.. ఇటీవల జైలు నుండి బయటికి వచ్చిన పంకజ్ శర్మ ఈ దాడికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసారు. చివరిగా ఈ ఘటనకు పాల్పడిన నేరస్తులందరినీ త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పుకొచ్చారు.
#Bihar: Loot and attack caught on CCTV camera from Patna.
Aditya with details.#Patna pic.twitter.com/N5wurj3qvl
— TIMES NOW (@TimesNow) January 20, 2022