కత్తి మహేశ్.. బతికున్నంత కాలం నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలిచిన వ్యక్తి. అయితే..,ఇప్పుడు ఆయన చనిపోయాక కూడా పెద్ద చర్చకి కారణం అయ్యారు. పోయిన నెల చివరిలో కత్తి మహేశ్ కి యాక్సిడెంట్ కావడం, ఆ తరువాత చెన్నై అపోలో హాస్పిటల్ రెండో వారాలకి పైగా ట్రీట్మెంట్ తీసుకోవడం, ఆ సమయంలోనే ఆయన కన్ను మూయడం అందరికీ తెలిసిందే.
అయితే.., కత్తి మహేశ్ మరణంపై ముందు నుండి అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ మీడియా సాక్షిగా ఈ అనుమానాన్ని లేవదీశారు. కత్తి మహేశ్ కి చాలా మంది శత్రువులు ఉన్నారు. ట్రీటెట్మెంట్ అంతా సవ్యంగా జరుగుతున్నా మనిషి చనిపోయాడంటే కాస్త అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి .., కత్తి మరణంపై విచారణ జరిపించాలని మందకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభత్వం ఆ దిశగా ఆర్డర్స్ పాస్ చేయడంతో.., కత్తి మహేశ్ పై మర్డర్ ప్లాన్ జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఈ నేపథ్యంలోనే కత్తి స్నేహితుడు, యాక్సిడెంట్ సమయంలో డ్రైవింగ్ చేసిన సురేష్ ని పోలీసులు విచారించారు. కోవూరు డీఎస్పీ, సీఐ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఏకంగా 4గంటలు పైనే ఈ విచారణ సాగింది. విచారణ జరిగిన విధానాన్ని సురేష్ మీడియాకి తెలియచేశాడు. కత్తి మహేశ్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ఇంత ఘోరం జరిగిందని, తాను సీట్ బెల్ట్ పెట్టుకున్నాని, పైగా డ్రైవింగ్ సీట్ లో ఉండటం చేత రెండు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని తనని కాపాడాయని సురేశ్ తెలియచేశాడు.
అయితే.., ఈ విచారణ ఇంతటితో ముగిసిపోయినట్టే అనుకోలేము. ఈ విషయంలో చెన్నై డాక్టర్స్ ని సైతం విచారించే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఇప్పుడు కత్తి మహేశ్ మరణం చుట్టూ పెద్ద తతంగమే నడుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.