ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరానికి చెందిన సీఐ స్వర్ణలత వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం అయిన సంగతి విదితమే. రెండు వేల నోట్ల మార్పిడిలో కొంత మందిని బెదిరించి డబ్బులు గుంజినట్లు తేలడంతో ఆమెను అరెస్టు చేసిన సంగతి విదితమే.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నగరానికి చెందిన సీఐ స్వర్ణలత వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం అయిన సంగతి విదితమే. రెండు వేల నోట్ల మార్పిడిలో కొంత మందిని బెదిరించి డబ్బులు గుంజిన ఆరోపణలపై ఆమెను అరెస్టు చేసిన సంగతి విదితమే. గాజువాకకు చెందిన ఇద్దరు రిటైర్డ్ నేవీ ఉద్యోగులతో రూ.90లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన రూ.2వేల నోట్లు వస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. కేవలం ఒక్క డీల్ తో 10 లక్షలు సంపాదించుకోవచ్చునని అత్యాశకు పోయి.. కటకటాలు పాలయ్యింది. అయితే ఆమె అరెస్టు తర్వాత ఆమె లీలలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. సినిమాలపై ఆసక్తితో ఉన్నట్లు, ఓ సినిమాలో నటిస్తున్నట్లు, డ్యాన్సులు నేర్చుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు మరో మహిళా సీఐ కక్కుర్తి పని చేసి అధికారులకు చిక్కింది.
తెలంగాణలోని హైదరబాద్ మహా నగరంలోని పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్ స్పెక్టర్గా వ్యవహరిస్తున్న మహిళా అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడింది. వివరాల్లోకి వెళితే.. ఈ కార్పొరేషన్ శానిటేషన్ సెక్షన్లో జానకి ఇన్ స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తుంది. శానిటేషన్ వస్తువులు సరఫరా చేసే వ్యక్తి నుండి జానకి లంచం అడిగింది. రూ.20 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులు విషయం తెలియజేశాడు. ఈ క్రమంలో రూ. 20 వేలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు నటించిన వ్యక్తి.. ఆ డబ్బులు ఇస్తుండగా అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా, ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.