అలవాటు వ్యసనంగా మారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసిందే. అందులో ఒకటి పేకాట. ఒకప్పుడు సరదాగా ఆడుకునే ఆట.. ఇప్పుడు కమర్షియల్ రంగులు పులుముకుంది. క్రికెట్ కన్నా పిచ్చ క్రేజ్ను తెప్పించే ఈ క్రీడ.. ఆడేవాడు అమితానందంలో ఉంటే..
అలవాటు వ్యసనంగా మారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసిందే. అందులో ఒకటి పేకాట. ఒకప్పుడు సరదాగా ఆడుకునే ఈ జూదం.. ఇప్పుడు కమర్షియల్ రంగులు పులుముకుంది. క్రికెట్ కన్నా పిచ్చ క్రేజ్ను తెప్పించే ఈ క్రీడ.. ఆడేవాడు అమితానందంలో ఉంటే.. చూసేవాడు టెన్షన్ పడిపోతుంటాడు. ఈ పేకాట ఆట ఆడుతూ.. కోటీశ్వరులై అయిన వారున్నారు.. ఒక్కరోజులోనే బికారులుగా మారినవారున్నారు. ఇక ఈ వ్యసనపరులకు ఆశ్రయం కల్పించేందుకు క్యాసినోవా వంటివి ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్నారు కొంత మంది. రమ్మీ అంటూ ఆన్ లైన్ కార్పొరేట్ వ్యాపారం కూడా మొదలై చాన్నాళ్లు అయ్యింది. అయితే పురుషులే ఎక్కువ వీటికి బానిసలవుతుంటే.. తామేమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు మహిళలు.
కిట్టీ పార్టీలు అంటేనే మహిళల కోసం ఏర్పాటు చేసేది. అదేదో సరదాగా వీకెండ్లో మహిళలంతా కలిసి ఆట పాటల్లో మునిగి తేలుతూ రిలాక్స్, చిల్ అవుతుంటారు. ఇప్పుడు ఇవి పేకాట కేంద్రాలుగా మారిపోయాయి. తాజాగా హైదరాబాద్ యూసఫ్ గూడలోని మధురా నగర్లో మహిళలు జూదమాడుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. మొత్తం 13 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో పెద్ద పెద్ద మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు నెలలుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు సమాచారం. ఈ నెల 27న పక్కా సమాచారంతో ఓ అపార్ట్ మెంట్ రమ్మీ ఆడుతూ లీనమైనమన పేకాట క్వీన్స్ను పట్టుకున్నారు. హైదరాబాద్లోని మధురానగర్లో జ్యోతి అనే మహిళ అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం.
పట్టుబడిన వారిలో ఐదుగురు వ్యాపార వేత్తలు, ఏడుగురు గృహిణీలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రెండు టేబుల్స్లో మహిళలు గ్యాంబ్లింగ్కు పాల్పడుతుండగా.. చూసిన పోలీసులు అవాక్కు అయ్యారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని, లక్షా ఇరవై వేల రూపాయాలను స్వాధీనం చేసుకన్నారు. మూడు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరెస్టైన మహిళల్లో 50-70 ఏళ్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. కిట్టీ పార్టీ పేరుతో మహిళలు తరచూ పేకాట ఆడడానికి వస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ సమాచారం అందించిందీ కూడా మహిళలేనని పోలీసులు చెప్పడం గమనార్హం. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.