అలవాటు వ్యసనంగా మారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసిందే. అందులో ఒకటి పేకాట. ఒకప్పుడు సరదాగా ఆడుకునే ఆట.. ఇప్పుడు కమర్షియల్ రంగులు పులుముకుంది. క్రికెట్ కన్నా పిచ్చ క్రేజ్ను తెప్పించే ఈ క్రీడ.. ఆడేవాడు అమితానందంలో ఉంటే..
కరోనా నేపథ్యంలో చాలామంది ఇళ్లలోనే గడుతున్నారు. దీంతో కాలక్షేపం కోసమని ఆన్లైన్ రమ్మీని ప్రారంభించి, చివరకు బానిసలుగా మారి పోతున్నారు. చాలామంది లక్షలాది రూపాయలను పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారు. టెక్నాలజీపై పట్టున్న కొంతమంది ఫేక్ జీపీఎస్ ద్వారా ఆన్లైన్ రమ్మీ యాప్లోకి యాక్సిస్ అవుతూ తమ ఆచూకీ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇటీవల కాలంలో మళ్లీ ఆన్లైన్ రమ్మీ పెరుగుతూ వస్తోంది. నగరంలో పురుషులతో సమానంగా మహిళలు ఆన్లైన్ రమ్మీ ఆడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉన్నతస్థాయి […]