తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ‘కార్తీకదీపం’ సీరియల్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలతో పాటు సీరియల్ లో విలన్ మోనిత పాత్ర కూడా అంతే కీలకం. మోనిత స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. ఇంట్లో కూర్చొని సీరియల్ చూసే ఆడాళ్ళు తిట్లదండకం మొదలెడతారు. విలన్ పాత్రతో అంతలా ప్రేక్షకులకు చేరువైంది మోనిత అలియాస్ శోభాశెట్టి. కన్నడకు చెందిన శోభాశెట్టి తెలుగు సీరియల్స్ లో బిజీ అయిపోయింది.
డాక్టర్ బాబుతో ప్రేమ.. అనూహ్య పరిస్థితుల్లో తల్లి కావడం.. డాక్టర్ బాబుని ఎలాగైనా తన వశం చేసుకోవడానికి మోనిత కుట్రలు.. అన్ని కలిపి కార్తీకదీపం సీరియల్ ని నెంబర్ 1 సీరియల్గా మార్చాయి. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు చనిపోయాక.. కార్తీకదీపం సీరియల్ని పూర్తిగా మార్చేశారు. అప్పుడు దీప, కార్తీక్, మోనితలపై నడిచిన కథను.. ఇప్పుడు శౌర్య, హిమల మధ్య కథాంశంతో అక్కచెల్లెల్ల పోరుగా మార్చేశారు. ఈ కథను ఎన్ని మలుపులు తిప్పినా.. పూర్వ వైభవాన్ని అందుకోలేకపోతుంది కార్తీకదీపం సీరియల్.
ఒకప్పుడు టాప్ రేటింగ్ కొల్లగొట్టిన ఈ సీరియల్.. ఇప్పుడు సగానికి సగం పడిపోయిందని టాక్. ఈ క్రమంలో సీరియల్ పూర్వ వైభవం అందుకోవాలంటే.. డాక్టర్ బాబు, వంటలక్క, మోనితల పునరాగమనం ఒక్కటే మార్గం అనుకుంటున్నారు. డాక్టర్ బాబు, వంటలక్కల పాత్రల్ని చంపేశారు కాబట్టి, తిరిగి తెచ్చే పరిస్థితి లేదు. సీరియల్స్ లో చనిపోయిన వాళ్లు బతికిరావడం అనేది పెద్ద విషయమే కాదు. కానీ, ఈ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబుల కంటే మోనిత రీఎంట్రీకి స్కోప్ ఉంది.
మోనిత ఎంట్రీతో కార్తీకదీపం సీరియల్ రేటింగ్ లో పుంజుకునే అవకాశం కూడా లేకపోలేదు. అయితే మోనిత తిరిగి రావాలని ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మోనిత పాత్రలో రీఎంట్రీ ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ లో ఉన్నట్టు స్పష్టం చేసింది శోభాశెట్టి. తాజాగా ఆమె యూట్యూబ్ ఛానల్లో ‘కార్తీకదీపంలోకి రీఎంట్రీ’ అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో తాను కార్తీకదీపంలోకి రాబోతున్నట్టుగా హింట్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
మోనిత మాట్లాడుతూ.. ‘రెగ్యులర్ గా నా ఫ్యాన్స్ అంతా నాకు కామెంట్లు పెడుతూనే ఉన్నారు. మళ్లీ కార్తీకదీపంలోకి ఎప్పుడు వస్తారు? అని అడుగుతూనే ఉన్నారు. నాకు కూడా మళ్లీ కార్తీకదీపం సీరియల్ లోకి రావడానికి ఉంది.. రావాలా? వద్దా? అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాం. త్వరలోనే దీనికి సంబంధించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. అంతకంటే ముందుగా.. ‘కార్తీకదీపం’ పాత ఆర్టిస్ట్లకు గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. సీరియల్ అయిపోయిన తర్వాత కలిసే అవకాశం రాలేదు. ఈ ఈవెంట్ తో మళ్లీ అందరం కలవబోతున్నామని చెప్పింది శోభాశెట్టి. మరి మోనిత రీఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.