భర్త మరణం తర్వాత ఆమె సీరియళ్లు, సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే తమిళ కొరియోగ్రాఫర్ అమీర్ ఎడిసన్తో ప్రేమలో పడింది. ప్రస్తుతం. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు.
తెలుగు సీరియల్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని నటి పావని రెడ్డి. సీరియల్, సినిమా నటిగా తెలుగులోనే కాదు తమిళ నాట కూడా గుర్తింపు తెచ్చుకుంది. పావని తెలుగు, తమిళ్, మళయాళ భాషల్లో పలు సీరియళ్లు, సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె తమిళ్ సీరియల్స్తో బీజీ అయిపోయింది. ఎప్పుడూ సినిమాలు, సీరియల్స్ షూటింగ్లతో బిజీబిజీగా ఉండేది. తాజాగా ఆమె ఆసుపత్రి పాలయ్యారు. దానికి కారణం గత కొన్ని నెలలుగా తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమె మెడ దగ్గర మేజర్ సర్జరీ చేశారు. దాదాపు 15 రోజులు ఆమె ఆస్పత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది.
ఆమె తన పోస్టులో.. ‘‘ఈ 15 రోజులు చాలా దారుణంగా గడిపాను. మెడ దగ్గర చిన్న నొప్పి మొదలైయింది. అది రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. నేను చాలా మంది డాక్టర్లను సంప్రదించాను. కానీ నొప్పి తగ్గలేదు. దీని వల్ల చాలా ఇబ్బందులు పడ్డా.. ఏడుస్తూ.. ఏన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నొప్పి తట్టుకోలేక కొన్ని సార్లు బోరున ఏడ్చేదాన్ని.. ఈ సందర్భంలోనే ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో చేరాను. ఎండోస్కోపిక్ డిసెక్టమీ సర్జరీ చేయించుకున్నాను. ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. డాక్టర్లకు నా కృతజ్ఞతలు. ఈ రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కష్ట సమయంలో తోడుగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా అమీర్ నా కోసం ఎంతో కష్టపడ్డాడు. నిద్రలేకుండా గడిపాడు’’ అని తెలియజేసింది.
కాగా 2016లో తెలుగు నటుడు ప్రదీప్ కుమార్తో ప్రేమలో పడింది పావని.. 2017, ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే, వీరి కాపురం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు. అనుకోని విధంగా ప్రదీప్ 2017 మే 17న హైదరాబాద్లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మరణం తర్వాత ఆమె తమిళ సీరియళ్లు, సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే తమిళ కొరియోగ్రాఫర్ అమీర్ ఎడిసన్తో ప్రేమలో పడింది. ప్రస్తుతం. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. మరి, మెడ నొప్పి కారణంగా పావని తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.