సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత యాక్ససబులిటీ బాగా పెరిగిపోయింది. పాత కాలం విషయాలు, వాటి తాలూకూ వివరాలు, ఫొటోలు, వీడియోలు ఇంట్లో కూర్చుని యాక్సెస్ చేయగలుగుతున్నాము. అన్ని రంగాలకు చెందిన సెలెబ్రిటీల పాత ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా వాళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా, ఓ ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఫొటో ఆ ఇద్దరు హీరోలు కాలేజ్లో చదువుతున్నప్పటిదిగా తెలుస్తోంది.
ఆ ఫొటోలో ఉన్న హీరోలు మరెవరో కాదు.. తమిళ స్టార్ హీరోలు సూర్య, విశాల్లు. ఆ ఫొటోలో ఇద్దరు ఇప్పటికంటే చాలా ప్రత్యేకంగా ఉన్నారు. ఏదో ఫంక్షన్లో తమ మిత్రులతో కలిసి కూర్చుని ఉన్నారు. అది కూడా ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. కుర్చీలో స్టైల్గా కూర్చుని ఫొటోకు ఫోజిచ్చారు. పక్కనున్న వారిలో కొంతమంది కెమెరా వైపు చూస్తుంటే మరికొందరు పక్కకు చూస్తూ ఉన్నారు. కాగా, సూర్య ప్రముఖ తమిళ సీనియర్ హీరో శివకుమార్ కుమారుడన్న సంగతి తెలిసిందే. ‘‘నేరుక్కు నేర్’’ అనే సినిమాతో సూర్య సినీ రంగ ప్రవేశం చేశారు. బాల దర్శకత్వం వహించిన నంద సినిమాతో సూర్య గ్రాఫ్ పెరిగింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ‘‘ కాక కాక ’’ సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. గజినీ సినిమాతో తెలుగుతో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.
ఇక, విశాల్ విషయానికి వస్తే.. ఈయన ప్రముఖ వ్యాపారవేత్త, సినిమా నిర్మాత జీకే రెడ్డి కుమారుడన్న సంగతి తెలిసిందే. విశాల్ అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమా కెరీర్ను ప్రారంభించారు. హీరో అర్జున్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశారు. చెల్లమే సినిమాతో హీరో అయ్యారు. పందెం కోడి సినిమాతో సూపర్ హిట్ను అందుకున్నారు. ఈ సినిమాతో తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించే సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతూ ఉన్నాయి. మరి, సూర్య, విశాల్ల ఓల్డ్ పిక్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఈ ఫొటోలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు.. ఎవరో గుర్తుపట్టారా?.. pic.twitter.com/M3gqUlaw0z
— venky bandaru (@venkybandaru13) January 17, 2023