మెగా కుటుంబ వారసుల్లో ఒకరైన వరుణ్ తేజ్-నటి లావణ్య త్రిపాఠి త్వరలో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే అటు మెగా కుటుంబం కానీ, వరుణ్ కానీ, నటి లావణ్య ఈ వార్తలను ఖండించనూ లేదు.. అలాగే సమర్థించనూ లేదు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నెలలోనే శర్వానంద్..రక్షితా శెట్టి మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే మరో జంట వివాహ బంధంలోకి అడుగుపెడుతుందని వార్తలు వచ్చాయి. మెగా కుటుంబ వారసుల్లో ఒకరైన వరుణ్ తేజ్-నటి లావణ్య త్రిపాఠి త్వరలో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే అటు మెగా కుటుంబం కానీ, వరుణ్ కానీ, నటి లావణ్య ఈ వార్తలను ఖండించనూ లేదు.. అలాగే సమర్థించనూ లేదు. ఇది ఫేక్ వార్త అయ్యి కూడా ఉండవచ్చునని అందరూ భావించారు. అలాగే నిశ్చితార్థం తేదీగా పేర్కొంటున్న జూన్ 9 వరకు ఆగి చూస్తే సరిపోతుంది కదా అనుకుంటున్న సమయంలో ఇప్పుడు అధికారిక ప్రకటన వెలువడింది.
అవును టాలీవుడ్ నయా ప్రేమ జంట వరుణ్ తేజ్-లావణ్య జంట త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ఈ నెల 9న వీరి నిశ్చితార్థం జరగబోతోంది. ఈ విషయాన్ని శ్రేయాస్ మీడియా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తూ.. ఆ జంటకు అభినందనలు తెలిపింది. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారని తెలుస్తోంది. అదే సమయంలో మెగా కుటుంబంలో జరిగిన ప్రతి వేడుకకు లావణ్య త్రిపాఠి హాజరు కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు ఊపందుకున్నాయి. వాటిని నిజం చేస్తూ జూన్ 9న ఎంగేజ్ మెంట్ రింగులు మార్చుకుంటున్నారు ఈ క్రేజీయెస్ట్ కపుల్.