డార్లింగ్ ప్రభాస్ పెద్దగా మాట్లాడడు. షూటింగ్స్, ఆ సినిమాల ఈవెంట్స్ లో తప్పించి బయట కూడా కనిపించడు. అలాంటి ప్రభాస్.. చాలా విషయాలు ఓపెన్ గా చెప్పాడు. తన పెళ్లి, కెరీర్, సినిమా డైలాగ్స్ చెబుతూ తెగ ఎంటర్ టైన్ చేశాడు. ఇదంతా కూడా తాజాగా రిలీజైన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ లో కనిపించింది. ఇక సరదాగా నవ్విస్తూనే ప్రభాస్ నుంచి చాలా విషయాల్ని హోస్ట్ బాలకృష్ణ రాబట్టాడు. అయితే ఇందులో ఓ విషయం మాత్రం తెగ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. రాజమౌళి చేసిన ఓ పని వల్ల అందరూ తనని తిడుతున్నారని ప్రభాస్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కొన్నేళ్ల ముందు వరకు ప్రభాస్, టాలీవుడ్ కే పరిమితమైన ఓ సాధారణ హీరో. అలాంటి ప్రభాస్.. ‘బాహుబలి’ మూవీతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రపంచం మొత్తం కోట్లాది మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. అయితే రాజమౌళితో పనిచేయడం అంటే హీరోలు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ తదితరులు ఈ విషయాన్ని చెప్పారు. అయితే ‘ఛత్రపతి’ కోసం జక్కన్నతో కలిసి పనిచేసినప్పుడు చాలా సౌలభ్యం ఉండేదని ప్రభాస్ చెప్పాడు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ఫైట్ సీన్ లో చుట్టూ జనాలు ఎక్కువమంది ఉన్న కారణంగా డైలాగ్ ని నెమ్మదిగా చెప్పి షాట్ పూర్తి చేశానని ప్రభాస్ చెప్పాడు.
ఇక ఆ తర్వాత కూడా ఇదే పద్ధతిని చాలా సినిమాల్లో కంటిన్యూ చేశానని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అలా ‘మిస్టర్ ఫర్ ఫెక్ట్’ షూటింగ్ టైంలోనూ కె.విశ్వనాథ్ లాంటి సీనియర్లతో యాక్ట్ చేసిన ఓ సీన్ లో డైలాగ్ ని సైలెంట్ గా చెప్పేసి సీన్ పూర్తి చేశానని ప్రభాస్ అన్నాడు. అప్పుడు విశ్వనాథ్, తనని దగ్గరకు పిలిచి డైలాగ్ గట్టిగా చెప్పాలని అన్నట్లు బయటపెట్టాడు. ఇప్పటికే చుట్టూ జనాలు ఉంటే డైలాగ్, బయటకు పెద్దగా చెప్పాలేనని.. ఈ కారణంగా చాలామంది డైరెక్టర్స్ తనని తిడుతుంటారని ప్రభాస్ నవ్వుతూ చెప్పాడు. దీన్నిబట్టి చూస్తు పాన్ ఇండియా స్టార్ అయినా సరే ప్రభాస్ కి ఇంకా ఆ సిగ్గు పోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ ఎపిసోడ్ పుల్ ఆన్ ఎంటర్ టైన్ చేస్తోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో పార్ట్ 2… వచ్చే శుక్రవారం రిలీజ్ కానుంది. మరి ప్రభాస్ చెప్పిన విషయంమై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.