ప్రేమకి సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా ఉండదు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక క్షణాన ప్రేమ పుడుతుంది. అయితే ఆ ప్రేమని కొందరు మాత్రమే పెళ్లి బంధంతో శాశ్వతం చేసుకుంటారు. అలాంటి అదృష్టవంతులలో ప్రముఖ కమెడియన్ యాదమ్మ రాజు ఒకరు. తనదైన కామెడీతో, హావభావాలతో కడుపుబ్బా నవ్వించే కమెడియన్ యాదమ్మ రాజు.. ఎట్టకేలకు ఒక ఇంటి వారయ్యారు. యాదమ్మ రాజు, స్టెల్లా రాజ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అతిథుల సమక్షంలో ఒకటయ్యారు. వీరి పెళ్లి వేడుకకు మెగా బ్రదర్ నాగబాబు సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
కాగా పెళ్ళికి ముందు హల్దీ ఫంక్షన్ జరిగింది. హల్దీ ఫంక్షన్ అంటే.. వధూవరులిద్దరికీ ముఖానికి, శరీరంపై పసుపు రాస్తారు. ఆ తర్వాత స్నానం చేయిస్తారు. ఎంతో సాంప్రదాయంగా జరిగే ఈ వేడుకలో బంధువులు, స్నేహితులు పాల్గొంటారు. బంధువులు అందరూ వధూ వరులకు పసుపు రాసి స్నానం చేయిస్తారు. ఈ క్రమంలోనే యాదమ్మ రాజు, స్టెల్లా రాజ్ లకి పసుపు రాసి స్నానం చేయించారు. ఆ తర్వాత స్టెల్లా రాజ్.. స్నేహితులు, బంధువులతో కలిసి డ్యాన్స్ చేశారు. స్నేహితులతో కలిసి మాస్ స్టెప్పులతో అలరించారు. భార్యని చూసి యాదమ్మ రాజు కూడా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.