రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనదైన పంచులు వేసి కడుపుబ్బా నవ్విస్తుంటాడు హైపర్ ఆది. తాజాగా తన భార్యను శ్రీదేవీ డ్రామా కంపెనీ స్టేజ్ పైకి తీసుకొచ్చి అందరికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనదైన పంచులు వేసి కడుపుబ్బా నవ్విస్తుంటాడు హైపర్ ఆది. ఎక్కువ శాతం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు. బుల్లితెర షోలతో పాటుగా.. సినిమాల్లో సైతం నటిస్తూ.. బిజీబిజీగా ఉంటున్నాడు. ఇక గతంలో ఆది పెళ్లి చేసుకున్నాడు, ఇదిగో ఆమె భార్య అంటూ వార్తలు, ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. అయితే తర్వాత అవన్నీ అబద్దాలు అని, ఏదో సినిమాలో చేసిన సీన్లు అని తెలిసింది. తాజాగా తన భార్యను శ్రీదేవీ డ్రామా కంపెనీ స్టేజ్ పైకి తీసుకొచ్చి అందరికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏప్రిల్ 2వ తారీఖుకుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఆది తన భార్యను పరిచయం చేశాడు.
హైపర్ ఆది.. స్క్రిప్ట్ రైటర్ గా, కమెడియన్ గా ఇటు బుల్లితెరపై అంటు వెండితెరపై దూసుకెళ్తున్నాడు. తనదైన టైమింగ్ పంచులతో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండటం కారణంగా కొన్ని రోజులు జబర్దస్త్ కు గ్యాప్ ఇచ్చాడు ఆది. కానీ శ్రీదేవీ డ్రామా కంపెని షోకు మాత్రం వస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ఏప్రిల్ 2వ తారీఖుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో ఎప్పటిలాగే ఆది తనదైన పంచులతో అదరగొట్టాడు.
ఇక ఇదే స్టేజ్ పై నా భార్య ఈమే అంటూ ఓ విదేశీ మహిళను పరిచయం చేశాడు. ఫేస్ కి మాస్క్ పెట్టుకుని, కూలింగ్ గ్లాస్ లతో శ్రీదేవీ డ్రామా కంపెనీ స్టేజ్ పై మెరిసింది ఈ భామ. హైపర్ ఆది పెళ్లాన్ని చూడాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్నారు.. ఆ మాస్క్ తీసెయ్ అని ఆది అంటే.. ఆమె మాత్రం నో అంటూ సమాధానం ఇచ్చింది. కనీసం నన్నైనా చూడనివ్వు, ఇప్పటి వరకు చూడలేదు అంటూ చమత్కరించాడు ఆది. ఇక ఈ ప్రోమోలో ఎక్స్ ట్రా జబర్దస్త్ కు కొత్త టీమ్ రాబోతున్నట్లు ప్రకటించింది యాంకర్ రష్మి.