‘జబర్దస్త్’ షో పేరు చెప్పగానే చాలామందికి కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. మరికొందరికి మాత్రం యాంకర్స్ అనసూయ, రష్మీ గుర్తొస్తారు. ఎందుకంటే ఈ ఇద్దరూ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అప్పటివరకు యాంకర్స్ అంటే పెద్దగా గ్లామర్ ని బయటపెట్టేవారు కాదు. ఎప్పుడైతే వీళ్లిద్దరూ గ్లామర్ అనే అడ్డుతెరని తొలగించారో వీళ్లకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ప్రత్యేకించి వీళ్ల కోసమే షో చూసేవారు. అలానే గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక విషయానికొస్తే.. 2013లో ‘జబర్దస్త్’ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ యాంకర్ గా అనసూయనే తీసుకొచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు షో నుంచి వెళ్లిపోయిన ఈమె.. తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ‘జబర్దస్త్’కు అనసూయ, ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’కు రష్మీ యాంకరింగ్ చేస్తూ వచ్చారు. అయితే గతేడాది మధ్యలో అనసూయ నుంచి షో నుంచి తప్పుకొంది. దీంతో చాలామంది.. అసలు అనసూయ ఎందుకు మానేసింది అని సందేహాపడ్డారు. అప్పట్లో ఈ విషయమై మాట్లాడుతూ బాడీ షేమింగ్ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
ఇక ఇప్పుడు మాత్రం అనసూయ మరో ట్విస్టు ఇచ్చింది. తను ఆ ఇద్దరి వల్లే ‘జబర్దస్త్’ మానేయాల్సి వచ్చిందని తాజాగా ఓ సందర్భంలో చెప్పింది. ఆ ఇద్దరూ తన కొడుకులని క్లారిటీ ఇచ్చింది. తన కొడుకులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే జబర్దస్ మానేశానని, ఓ పక్క షూటింగ్స్ మరోపక్క షో వల్ల పిల్లలతో టైం స్పెండ్ చేయాలేకపోతున్నానని అందుకే ‘జబర్దస్త్’కు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందని అనసూయ చెప్పుకొచ్చింది. ఎనిమిదేళ్లుగా ఈ షో తనకు చాలామంచి కెరీర్ ఇచ్చిందని, ఇప్పుడు సినిమాల్లో బిజీ కావడం కూడా జబర్దస్త్ మానేయాడానికి మరో కారణమని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలైన ‘పుష్ప 2’, ‘మైకేల్’లో అనసూయ కీలకపాత్రలు చేస్తోంది. మరి అనసూయ వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.