విజయ్ దేవరకొండ వర్సెస్ అనసూయ వివాదం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సమయం దొరికినప్పుడల్లా విజయ్ ని ఏదో రకంగా అనసూయ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ గొడవపై విజయ్ దేవరకొండ స్పందించారు.
అనసూయ, విజయదేవరకొండల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో అర్జున్ రెడ్డి మూవీ ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ తో మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా ట్విట్టర్ లో అనసూయ ఓ రేంజ్ లో ఇచ్చిపడేస్తున్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా అనసూయని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. మొన్నా మధ్య కూడా ది కాంట్రావర్సీ ఎంత రచ్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ది పైత్యం ఏంటో అంటూ అనసూయ ట్వీట్ చేయడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను బాగా ట్రోల్ చేశారు. ఆంటీ అంటూ విపరీతంగా ఆటపట్టించారు. దానికి ఆమె కూడా గట్టిగానే బదులిచ్చుకుంటూ వచ్చారు. తాజాగా దీనిపై విజయ్ దేవరకొండ స్పందించారు.
తన పేరు ముందు ది అనే పదం పెట్టుకోవడానికి గల కారణమేంటో వెల్లడించారు. ఖుషీ ట్రైలర్ ఈవెంట్ లో భాగంగా ఆయన అనసూయ వివాదంపై స్పందించారు. అందులో భాగంగానే అనసూయ చేసిన ‘ది పైత్యం’ కామెంట్ పై విజయ్ మాట్లాడారు. ది దేవరకొండ పేరు ఎందుకు పెట్టుకున్నారో అనే దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. రౌడీ స్టార్, సౌత్ సెన్సేషన్ ఇలా తన పేరు పక్కన ఏదో ఒకటి రాసేస్తున్నారు. అయితే లైగర్ సమయంలో తన పేరు పక్కన ఏదో ఒక పేరు పెట్టుకోమని పూరీ జగన్నాథ్ సలహా ఇచ్చారని.. ఓ రెండు, మూడు పేర్లు సజెస్ట్ చేశారని విజయ్ అన్నారు. అయితే తాను మాత్రం ఆ పేర్లేమీ వద్దని అన్నట్లు వెల్లడించారు.
తనకు అమ్మ, నాన్నలు పెట్టిన పేరు ఉందని.. విజయ్ దేవరకొండ అనే వాడు ఒకడే ఉన్నాడని.. అది తానే అని.. అందుకే పేరు ముందు ది అని పెట్టుకున్న అని స్పష్టత ఇచ్చారు. ఇక అనసూయతో గొడవ ఏంటి అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విజయ్ సమాధానమిచ్చారు. ఎప్పుడు కూడా మీరు వివాదాలకు దూరంగా ఉంటారని అంటారు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయ వార్ నడుస్తుందని.. ట్విట్టర్ లో గొడవలు అవుతుంటాయి. దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? దీని వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుందని అడిగారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఎందుకు గొడవ పడుతున్నారో గొడవ పడేవాళ్ళనే అడగాలని.. ఏం నడుస్తుందో, ఎందుకు నడుస్తుందో తనకు తెలియదని అన్నారు. మరి విజయ్ కామెంట్స్ పై అనసూయ ఎలా స్పందిస్తారో చూడాలి.