తెరపై కనిపించేంత గొప్పగా ఉండవు సెలబ్రిటీల జీవితాలు. వారికి కూడా అనేక కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. సమంత, శృతి హాసన్, నయనతార ఇలా అనేక మంది సెలబ్రిటీలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారే. తాజాగా సీరియల్ నటి కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. కనీసం తిండి కూడా తినలేకపోతోంది. ఆమెకు వచ్చిన జబ్బు ఏంటో కూడా డాక్టర్లు నిర్ధారించలేకపోతున్నారు. ఆ నటి ఎవరంటే?
బుల్లితెర నటి, నాగిన్ టెలివిజన్ సిరీస్ సీజన్ 6లో నటించిన శిఖా సింగ్ అనారోగ్యంతో బాధపడుతోంది. రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతోంది. సోషల్ మీడియాలో తన అనారోగ్య సమస్యల గురించి గతంలో ఒక పోస్ట్ చేసింది. గత కొంతకాలంగా తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పింది. రెండు నెలల క్రితం తనకు స్కిన్ అలర్జీ వచ్చిందని, ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ మందులు రాసిచ్చారని.. కానీ ఒకటి, రెండు రోజుల్లోనే తన పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొంది. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసినా ఏమీ నిర్ధారణ కాలేదని.. అంతా బానే ఉందని చెప్పారని అన్నారు. అయితే తాను ఏమీ తినలేకపోతున్నానంటూ ఆమె వెల్లడించింది. కేవలం తేలికపాటి ఆహారం, కిచిడి తప్ప ఇంకేమీ తినలేకపోతున్నానని తెలిపింది.
గత నెలలో కొంచెం నయం అయితే.. విరామం తీసుకోవాలని అనుకుంది. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఫిబ్రవరి 7న తన పుట్టినరోజు అని చెప్పి నైరోబీ ట్రిప్ కి వెళ్లామని తెలిపింది. అయితే బాగానే ఉన్నానని అనుకునేలోపే మళ్ళీ ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చిందని వెల్లడించింది. ట్రిప్ నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచి తాను బెడ్ మీదే ఉంటున్నానని వెల్లడించింది. తన భర్త కరణ్ పైలట్ కాబట్టి అతను డ్యూటీ కోసం వెళ్లిపోవాల్సి ఉంటుందని.. ఒక్కర్తే ఇంట్లో బాధపడుతున్నానని పేర్కొంది. అనారోగ్య సమస్యలు తన మానసిక స్థితిని ప్రభావితం చేస్తున్నాయని బాధపడుతోంది. తనకొచ్చిన జబ్బు గురించి డాక్టర్లు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారని.. ఈ విషయంలో తనకేం చేయాలో కూడా అర్ధం కావడం లేదని వెల్లడించింది.
అందరూ తినే ఫుడ్ ఎందుకు తినలేకపోతున్నానో అంటూ తనను తాను ప్రశ్నించుకుంటోంది. గతంలో తన అనారోగ్య సమస్యల గురించి బయటకు చెప్పకూడదని అనుకున్నాను. కానీ ఇంత పెద్ద నగరంలో ఉంటున్నప్పుడు.. ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నప్పుడు.. ప్రజలు మిమ్మల్ని పట్టించుకోవాలని.. మీ దగ్గరకు రావాలని కోరుకుంటారు. అలానే తాను కూడా తన సమస్య గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని వెల్లడించింది. తన కూతురు రోజూ తన వద్దకు వచ్చి.. అమ్మా ఏమైంది అంటూ అడుగుతుందని..తన ముఖం చూసినప్పుడు బాధ కలుగుతుందని, తాను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వెల్లడించింది.
కరోనా పాండమిక్ తర్వాత చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. మనమంతా ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలని, ప్రేమను పంచుకోవాలని ఆమె కోరింది. సోషల్ మీడియాలో కనిపించేంత గ్లామరస్ గా నటుల జీవితం ఉండదని.. ఆమె వెల్లడించింది. నటులు కేవలం పాజిటివ్ లైఫ్ గురించే మాట్లాడతారని.. అది గ్లామర్ గురించో, హాలిడే ట్రిప్పుల గురించో కాదని.. మాకు కూడా జీవితంలో కఠినమైన సమయం ఉంటుందని వెల్లడించింది. అయితే తనకు ఎదురైన పరిస్థితి గురించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని, ఈ మందులు పని చేస్తాయని నమ్ముతున్నానని, త్వరలోనే రికవరీ అయ్యి తన సాధారణ జీవితంలోకి తిరిగి వస్తానని వెల్లడించింది. మరి ఈ నటి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.