సినిమా అనేది జనాలను ఎంతలా ప్రభావితం చేస్తుందో.. సినిమా అనేది పరిష్కరించలేని కొన్ని పెద్ద సమస్యలను జనాల దృష్టికి తీసుకెళ్తుందో.. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు గురించి వింటే అర్థమవుతుంది. కొన్ని సినిమాలు జనాలకు వినోదాన్ని పంచుతాయి. కొన్ని సినిమాలు జనాలను మోటివేట్ చేస్తాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే జనాలను తట్టిలేపి.. మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి. తాజాగా విడుదలైన సర్కారు వారి పాట చిత్రం ఆ కోవకే చెందుతుందని అంటున్నారు నెటిజన్లు.
వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా.. ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బ్యాంకు లోన్ రికవరీ విషయంలో సంపన్నులు, సామాన్యుల పరంగా ఎలాంటి తేడా చూపించకూడదనే నేపథ్యంలో సర్కారు వారి పాట తెరకెక్కింది. తాజాగా సుప్రీం కోర్టు బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చి సంచలనంగా మారింది.
ఇప్పుడు సుప్రీం కోర్టు తన తాజా తీర్పులో సర్కారు వారి పాట థీమ్ ని వెల్లడించి రైతులకు ఊరటనిచ్చింది. రైతుల నుంచి లోన్ లు రికవరీ చేయాలంటూ ఓ బ్యాంకు వేసిన పిటీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సదరు బ్యాంక్ కు.. `సర్కారు వారి పాట`లో చూపించిన విధంగా.. “పెద్ద చేపలను పట్టుకున్న తరువాతే రైతుల జోలికి వెళ్లండి. ఇలాంటి పిటిషన్ల వల్ల రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయి” అని జస్టీస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు వెల్లడించిన ఈ తీర్పును సోషల్ మీడియాలో `సర్కారు వారి పాట` మేకర్స్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు తీర్పు నెట్టింట వైరల్ అవుతోంది. మరి సుప్రీం కోర్టు తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#SarkaruVaariPaata https://t.co/rQ5wmJfdsG
— Mythri Movie Makers (@MythriOfficial) May 13, 2022