తెలుగు ప్రేక్షకులను ఎన్నో సంవత్సరాలుగా అలరిస్తున్న ‘పాడుతా తీయగా‘ సింగింగ్ షో. దివంగత లెజెండరీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మొదలుపెట్టిన పాడుతా తీయగా కార్యక్రమం ఇండస్ట్రీకి ఎంతోమంది గొప్ప గాయనీ గాయకులను పరిచయం చేసింది. బాలు గారు పరమపదించిన తర్వాత పాడుతా తీయగా కార్యక్రమాన్ని ఆయన కుమారుడు, సింగర్ చరణ్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం పాడుతా తీయగా షోకి ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్, సింగర్ సునీత, సింగర్ విజయ్ ప్రకాశ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా పాడుతా తీయగా కొత్త ప్రోమో రిలీజ్ అయింది. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి స్వరపరిచిన పాటలతో నిర్వహించిన ఈ సరికొత్త ఎపిసోడ్ ప్రోమోలో యువ గాయనీ గాయకులంతా పాటలు పాడారు.
ఓ పాట దగ్గర మాత్రం జడ్జిలు, తోటి గాయకులతో సహా అందరూ కంటతడి పెట్టుకున్నారు. ఓ కుర్రాడు ‘నా ఆటోగ్రాఫ్’ సినిమాలోని ‘నువ్వంటే ప్రాణమని’ అనే పాటకి అందరూ కనెక్ట్ అయిపోయారు. అతని లైఫ్ గురించి తెలుసుకునే సరికి సింగర్ సునీత తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.