టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్స్ లో ఒకరు శేఖర్ కమ్ముల. ఇటీవలే నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ మూవీ తెరకెక్కించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. తదుపరి సినిమా తమిళ స్టార్ హీరో ధనుష్ తో చేయబోతున్నట్లు గతేడాది అధికారికంగా ప్రకటించాడు. శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్ ఎవరు ఊహించలేదు కాబట్టి సినిమా పై అంచనాలు ఓ స్థాయిలో సెట్ అయ్యాయి.
ధనుష్ తో సినిమా అని ప్రకటన అయితే వచ్చింది.. కానీ ఇంతవరకు ఆ సినిమా మూమెంట్ ఏంటనేది అప్ డేట్ లేదు. ఇదిలా ఉండగా.. శేఖర్ కమ్ముల, స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి కాంబినేషన్ లో మరో సినిమా రానుందని వార్త వైరల్ అవుతోంది. ఇదివరకు వీరి కాంబోలో ‘లీడర్‘ సినిమా వచ్చింది. రానాని వెండితెరకి పరిచయం చేసింది కూడా శేఖర్ కమ్ములనే.దాదాపు పదేళ్ల తర్వాత రానాని పరిచయం చేసిన ‘లీడర్’ సినిమా సీక్వెల్ తో శేఖర్ కమ్ముల కొత్త సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సీక్వెల్ కి సంబంధించి ఇప్పటికే రానాని కలిసి శేఖర్ కమ్ముల స్టోరీ లైన్, కొన్ని సీన్స్ నేరేట్ చేశాడని.. ప్రస్తుతం స్క్రిప్ట్ అంతా రెడీ చేసే పనిలో పడినట్లు సినీవర్గాల సమాచారం. ఈ త్వరలోనే వీరి కాంబినేషన్ మూవీ పై క్లారిటీ రానుందని ఇండస్ట్రీ టాక్. తాజాగా రానా కూడా భీమ్లా నాయక్ బ్లాక్ బస్టర్ తో హిట్ ట్రాక్ లో చేరాడు. చూడాలి మరి క్లాస్ డైరెక్టర్ తో రానా పొలిటికల్ సీక్వెల్ ఎలా ఉండబోతుందో.. ఇక వీరి కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.