ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ సలార్. కొన్ని వేల లక్షల వాట్స్ తో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకి సంబంధించిన టీజర్ ఎట్టకేలకు విడుదలయ్యింది. టీజర్ చూస్తుంటే మెంటల్ వచ్చేస్తుంది.
మహాభారతం తీయాలన్న లక్ష్యం కలిగిన రాజమౌళికి బాహుబలి సినిమా తన దృష్టిలో టీజర్ అన్నట్టు.. ప్రశాంత్ నీల్ దృష్టిలో కేజీఎఫ్ కూడా ఒక టీజర్ మాత్రమే అని గతంలో హీరో యష్ వెల్లడించారు. అంతలా ప్రశాంత్ నీల్ మైండ్ లో అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని అన్నారు. యష్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ ఛాప్టర్లు ఒక ఎత్తు ఐతే ఇప్పుడు ప్రభాస్ తో తీస్తున్న సలార్ మరొక ఎత్తు. సాలిడ్ కటౌట్ కలిగిన ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా అనౌన్స్ చేయగానే అందరూ ఒకటి ఫిక్స్ అయిపోయారు. అదేంటంటే.. ఇండియన్ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుంది అని. నిజమే సినిమా టీజర్ చూస్తుంటే అదే అనిపిస్తుంది.
పోస్టర్ తో సినిమా ఎలా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పి ఊరిస్తూ వచ్చిన ప్రశాంత్ నీల్ ని నెటిజన్స్ అసలు ఏం సినిమా తీస్తున్నావు, ఎలాంటి సినిమా తీస్తున్నావు, మా ప్రభాస్ అన్నతో ఏం ప్లాన్ చేసావ్ అంటూ నెటిజన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు దండం పెడతా ఆ టీజర్ మా ముఖాన పడేయ్ అన్న అంటూ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే ఫ్యాన్స్ ఎంత కంగారు పెట్టినా సమయం వచ్చినప్పుడే వదులుతారు. అలా గురువారం ఉదయం 5 గంటలకు వారికి సమయం వచ్చింది. ఇవాళ ఉదయం 5.12 గంటలకు సలార్ టీజర్ విడుదల చేశారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన టీజర్ మొత్తానికి వచ్చేసింది. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూస్ దక్కించుకుంది. టీజర్ విడుదలైన రెండు గంటల్లో 12 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఈ టీజర్ కోసం అలారం పెట్టుకుని మరీ ఎదురు చుశారు. కొంతమంది ఐతే రాత్రంతా మేల్కొని ఉన్నారు. అంతలా ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ వెండితెర మీద ఏం మ్యాజిక్ చేయబోతున్నారో అని. టీజర్ ఓపెన్ చేస్తే.. హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ప్రశాంత్ నీల్ సినిమానా? హాలీవుడ్ దర్శకుడి సినిమానా? అన్న కన్ఫ్యూజన్ కలుగుతుంది. వందల మంది గ్యాంగ్ స్టర్స్ తుపాకులు పట్టుకుని ఒక వృద్ధుడిని చుట్టుముడతారు. ఆ వ్యక్తి ప్రభాస్ మనిషి అని అర్ధమవుతుంది. అతను ప్రభాస్ గురించి చెప్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అందరూ అరుస్తుంటే.. ఆ వ్యక్తి ఏయ్ అని వారి నోర్లు మూయిస్తాడు.
‘సింపుల్ ఇంగ్లీష్, నో కన్ఫ్యూజన్.. సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం. కానీ జురాసిక్ పార్క్ లో కాదు. ఆ పార్క్ గురించి చెప్పాలంటే.. అందులో’ అంటూ ఒక డైలాగ్ వచ్చి ప్రభాస్ ఫేస్ రివీల్ చేస్తారు. అంటే ప్రభాస్ ఇక్కడ డైనోసర్ అని దర్శకుడు చెప్పారు. డైనోసార్ ఉన్న చోట సింహం, చిరుత, పులి, ఏనుగు వంటివి ప్రమాదం కాదని.. ఎందుకంటే ఆ డైనోసార్ వాటిని తినేస్తుంది అని దర్శకుడు చెప్పకనే చెప్పారు. గ్యాంగ్ స్టర్లు అందరూ అడవిలో ఉండే మృగాలు అయితే.. ప్రభాస్ జురాసిక్ పార్క్ లో ఉండే డైనోసార్ అని ప్రశాంత్ నీల్ మావ ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంది. ఇది తెలుగు సినిమా కాదు హాలీవుడ్ సినిమా.
ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర గానీ, ఇతర పాత్రలు గానీ చూస్తుంటే ఒక మాఫియా మూవీనో లేదా మాఫియా గేమ్ నో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. తుపాకులు, కత్తులు పట్టిన ప్రభాస్ ని చూస్తుంటే మోడ్రన్ అర్జునుడిలా కనబడుతున్నాడు. మోడ్రన్ కురుక్షేత్రంలో మోడ్రన్ మహా భారత యుద్ధం చేస్తున్న అర్జునుడిలా అనిపిస్తున్నారు ప్రభాస్. మహాభారత కథని మోడ్రనైజ్ చేసి హాలీవుడ్ దర్శకులు తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఆ క్యారెక్టరైజేషన్, మ్యానరిజం, ఆ ఫ్రేమ్స్, ఆ ఎడిటింగ్ స్టైల్ గానీ, ఆ మేకింగ్ గానీ అన్నీ కూడా హాలీవుడ్ సినిమాని పోలినట్టే ఉన్నాయి. చూస్తుంటే ఇండియన్ సినిమా, హాలీవుడ్ సినిమా గీతని చెరిపేసేటట్టుంది ఈ సినిమా.
ఫ్యాన్స్ కి మాత్రం ప్రభాస్ మినీ సైజ్ ట్రీట్ ఇచ్చారు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, టిను ఆనంద్, గరుడ రామ్, ఈశ్వరి రావు, శ్రియా రెడ్డి నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం – సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా టీజర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.