రాకింగ్ రాకేష్- జోర్దార్ సుజాతల పెళ్లి తిరుపతిలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి మంత్రి ఆర్కే రోజా దంపతులు హాజరయ్యారు. కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ పెళ్లిపై రోజా శుక్రవారం ఓ ఎమోషన్ల్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో...
ప్రముఖ కమెడియన్ రాకింగ్ రాకేష్ – జోర్దార్ సుజాతలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా, వీరి పెళ్లి వేడుక తిరుపతిలో ఘనంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వీరి పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా దంపతులు రాకేష్-సుజాతల పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి రోజా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ మాంగల్యం తంతు నానేన మమ జీవన హేతునా! కంఠే బధ్నామి సుభగే! త్వంజీవ శరదాం శతమ్..
నాకు అత్యంత ఆప్తులు.. నన్ను అమ్మా అని పిలిచే రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాతల సుఖ జీవనానికి హేతువైన మంగళ సూత్రంతో మాంగల్యాన్ని సుజాత మెడలో కట్టిన శుభగడియలో ఈ జంట నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లుగాక!! సుఖీభవ సుమంగళి సుఖీభవా సు(జాత)శీలవై చిరాయువై సుఖీభవా.. ’’ అని అన్నారు. ప్రస్తుతం రోజా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు రాకేష్-సుజాతల జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, రాకింగ్ రాకేష్ దాదాపు ఇరవై ఏళ్ల క్రితం కుటుంబంతో పాటు హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. హైదరాబాద్కు వచ్చిన కొత్తలో మిమిక్రీ-వెంట్రిలాక్విజం షోలు చేసి పేరు తెచ్చుకున్నారు. తర్వాత జబర్థస్త్ షోతో రాకేష్ దశ తిరిగిపోయింది.
ధనరాజ్ టీమ్ లో ఓ సభ్యుడిగా ‘జబర్దస్త్’లోకి ఎంట్రీ ఇచ్చాడు రాకేష్. కొన్నాళ్లకు కిరాక్ ఆర్పీ-రాకింగ్ రాకేష్ పేరుతో టీమ్ లీడర్ కూడా అయ్యాడు. ఆర్పీ వెళ్లిపోవడంతో సింగిల్ టీమ్ లీడర్ గా మారిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు కొన్నేళ్లపాటు తనదైన కామెడీ చేస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సుజాతతో ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కారు. మరి, రాకేష్- సుజాతల ప్రేమ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.