వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా నిర్మించిన చిత్రం డేంజరస్. అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇండియాలోనే మొదటి లెస్బియన్, క్రైమ్, యాక్షన్, లవ్ స్టోరీ చిత్రం ఇది. ఈ చిత్రాన్ని థియేటర్లు, పే అండ్ వ్యూ విధానంలో తీసుకొస్తున్నారు. ఈ చిత్రం అమ్మకానికి రామ్ గోపాల్ వర్మ కొత్త దారిని ఎంచుకున్నారు. నాన్ ఫ్యూజిబుల్ టోకెన్స్.. విధానంలో ఈ చిత్రానికి ఫండ్ కలెక్ట్ చేశారు. ఆర్జీవీకున్న క్రేజ్తో మొత్తం టోకెన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
NFT అంటే నాన్ ఫ్యూజిబుల్ టోకెన్స్ అంటారు. ఇది కూడా ఒక క్రిప్టోకరెన్సీ మాదిరిగానే ఉంటుంది. ఒక డేటా కలిగి ఉన్న ఫైల్ ను NFT అంటారు. అది ఇమేజ్ కావచ్చు, పాట, ట్వీట్, టెక్ట్స్ కావచ్చు. లేదా మరేదైనా డిజిటల్ ఫార్మాట్ కావచ్చు. దీనికి ఒక ధర నిర్ణయిస్తారు ఆ ధర చెల్లించి దానిని సొంతం చేసుకోవచ్చు. NFT అనేది ఒక డిజిటల్ ఫార్మాట్ పై యాజమాన్య హక్కును అందజేస్తుంది. ఈ NFT ఫైల్స్ ను బ్లోక్ చైన్ ద్వారా దాని క్రెడిబిలిటీ పరిశీలిస్తారు, అంచనా వేస్తారు. వీటిని కొనేందుకు వీటిని కొనేందుకు ‘ఓపెన్సీ’, ‘రారిబల్’ ప్రముఖ వెబ్ సైట్స్ ఉన్నాయి. NFTని భద్రపరుచుకునేందుకు ప్రత్యేకంగా వాలెట్స్ కూడా ఉంటాయి.
డేంజరస్ చిత్రాన్ని మొత్తం 6 లక్షల టోకెన్లుగా విభజించారు. వాటిలో లక్ష టోకెన్లు చిత్ర బృందం కోసం రిజర్వు చేసుకున్నారు. మీగిలిన 5 లక్షల టోకెన్లను ఒక్కొక్కటి రూ.149.90 ధర నిర్ణయించి అమ్మకానికి పెట్టారు. ఈ టోకెన్లు మొత్తం అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఆర్జీవీ గతంలో చేసిన పే అండూ వ్యూ సినిమాలను, యూట్యూబ్ చిత్రాలను ప్రస్తావిస్తూ బయ్యర్లకు కాన్ఫిడెన్స్ పెంచారు. చిత్రం మీద వచ్చిన ఆదాయాన్ని టోకెన్లను బట్టి పంచుతామని తెలిపారు. రూ.10 లక్షలకు మించి టోకెన్లు కొనుగోలు చేసిన వారిని ప్రత్యేకంగా సినిమా రిలీజ్ ఫంక్షన్ కు ఆహ్వానిస్తామని తెలిపారు. క్రెడిట్స్ పేరు కూడా వేసతామని తెలిపారు.