ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను సీరియల్స్ ఎంతలా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదివరకు సినిమాలలో చూసే స్టంట్స్ అన్నీ ఈ మధ్యకాలంలో సీరియల్స్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ చూసినవే అనిపించినా.. ప్రతి సీరియల్ కి ఫ్యాన్ బేస్ కూడా భారీ లెవెల్ లోనే ఉంటుంది. ముఖ్యంగా సీరియల్స్ కి మహిళా అభిమానులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అమ్మాయిలు, గృహిణులు సినిమాలు చూస్తారో లేదోగానీ, సీరియల్స్ మాత్రం టైంకి, క్రమం తప్పకుండా అన్ని ఎపిసోడ్స్ చూస్తుంటారు. ఒకవేళ ఎపిసోడ్ మిస్ అయితే.. వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ ఎపిసోడ్ చూసేదాకా నిద్రపోరని కూడా మనం వింటుంటాం.
తాజాగా ఓ పాపులర్ తెలుగు సీరియల్ లో నటి తీసుకున్న షాకింగ్ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘ప్రేమ ఎంత మధురం’ అనే సీరియల్ కి సంబంధించి ఎపిసోడ్ పై వెలువడుతున్న కథనాలు ఆసక్తిని రేపుతున్నాయి. మరాఠీ భాషలో సూపర్ హిట్ అయినటువంటి `తులా ఫఠేరే` ఆధారంగా ఈ సీరియల్ ని తెలుగులో రీమేక్ చేశారు. శ్రీరామ్ వెంకట్, వర్ష హెచ్ కె ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్ లో జయలలిత, రామ్ జగన్, జ్యోతి రెడ్డి, బెంగళూరు పద్మ, విశ్వమెహన్, రాధాకృష్ణ, కరణ్, సందీప్, అనుషా సంతోష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ క్రమంలో.. అను అనే పాత్రను పావుగా వాడుకొని విలన్ రాగసుధ.. ఆర్యవర్ధన్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిస్తుంది. దీంతో అను కంప్లైంట్ ని సీరియస్ తీసుకున్న పోలీసులు.. ఆర్యవర్ధన్ ని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. తీరా ఆఫీస్ కి చేరుకున్నాక, అనుకి అసలు విషయం తెలిసి ఆర్యవర్ధన్ ని అరెస్ట్ చేయొద్దని చెబుతుంది. ఇదంతా రాగసుధ చేయించిందని గ్రహించిన ఆర్యవర్ధన్.. డీసీపీని కలిసి తన భార్య రాజనందినిని హత్య చేసింది.. ఆమె చెల్లి రాగసుధ అని ఆధారాలు అందజేస్తాడు.
ఈ నేపథ్యంలో కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు ఆధారాలు చేతబట్టుకుని రాగసుధను వెతికే పనిలో పడతారు. ఎలాగైనా తన గుట్టు రట్టయిందని గ్రహించిన రాగసుధ.. పోలీసుల వాహనానికి అడ్డుపడి, పెట్రోల్ పోసుకొని అంటించుకుంటానంటూ ఎత్తుగడ వేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో పోలీసులు ఏం చేశారు? ఆర్యవర్ధన్, రాగసుధ ఇద్దరిలో ఎవరి ప్లాన్ వర్కౌట్ అయ్యిందనేది సస్పెన్స్ గా నిలిచింది. మరి ఏం జరిగిందనే తెలియాలంటే కొత్త ఎపిసోడ్ చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.