వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు కాగా మరొకటి యువ దర్శకడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు.
సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. వారం రోజుల కింద ఈ సినిమా మేకింగ్ వీడియో ను చిత్ర బృందం రీలిజ్ చేసింది. ఈ మేకింగ్ వీడియోతో పవన్ ఫ్యాన్స్ కొత్త కోలహలం మొదలైంది. ఉత్సాహం నుంచి పవన్ ఫ్యాన్స్ తేరుకోకముందే ఈ బీమ్లా నాయక్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది బీమ్లా నాయక్ టీం. నిత్యామీనన్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాలు కనిపిస్తు న్నాయి. గీతా గోవిందం సినిమా తర్వాత పవన్ సినిమాతో టాలీవుడ్ లోకి నిత్యామీనన్ రీ ఎంట్రీ ఇవ్వునుంది. రానా కి జోడీగా ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేస్తున్నట్లు టాక్.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. విడుదల తరువాత ఈ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
We are extremely delighted to welcome an exceptional & proficient talent @menennithya on board for our #ProductionNo12 ⭐#BheemlaNayak Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @dop007 @vamsi84 @NavinNooli pic.twitter.com/xxfRx8znFZ
— Sithara Entertainments (@SitharaEnts) July 30, 2021