ప్రభాస్ ఫ్యాన్స్.. మీకు ఇది షాకింగ్ న్యూస్! ఎందుకంటే 'ప్రాజెక్ట్ K'ఓ హాలీవుడ్ మూవీకి రీమేక్ అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి?
ప్రభాస్ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నాడు. ఆయా చిత్రాల్లో ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాడనేది అభిమానులకు ఓ ఐడియా ఉంది. కానీ ఓ మూవీలో మాత్రం ప్రభాస్ అసలు ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నాడనేది అంచనాకు రాలేకపోతున్నారు. అదే ‘ప్రాజెక్ట్ K’. ఇప్పటివరకు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ఎక్కువగా కనిపించాయి కానీ అసలు సిసలు స్టోరీ ఏంటనేది ఎవరికీ తెలియట్లేదు. ఇప్పుడు ఇదంతా కాదన్నట్లు ఇది.. ఓ హలీవుడ్ సినిమాకు రీమేక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి సంగతి? ఇందులో నిజమెంత?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో అద్భుతమైన విజన్ ఉన్న డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లలో నాగ్ అశ్విన్ ఒకడు. ఇప్పటివరకు ‘మహానటి’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలే తీశాడు. తన మూడో చిత్రానికే ప్రభాస్ ని లైన్లో పెట్టాడు. గత రెండు మూడేళ్ల నుంచి సెట్స్ పై ఉన్న ఈ మూవీ ప్రస్తుతం చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి వస్తుందని కొన్నాళ్ల ముందే అధికారికంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వచ్చింది కాస్త నిజమే అనిపిస్తోంది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘ప్రాజెక్ట్ K’.. హాలీవుడ్ లో 2013లో వచ్చిన ‘ఎలిసియం’ అనే మూవీకి రీమేక్ అనే టాక్ వినిపిస్తుంది. ఈ స్టోరీలో భాగంగా 2154లో భూమిపై పూర్తిగా ఓవైపు రోగాలు, మరోవైపు కాలుష్యంతో పాడైపోతుంది. దీంతో కొందరు డబ్బునోళ్లు.. ‘ఎలిసియం’ అనే ప్లానెట్ పైకి వెళ్లిపోతారు. అప్పుడు భూమిపై ఉన్న హీరో.. మిగతా ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది స్టోరీ. ‘ప్రాజెక్ట్ K’లోనూ ప్రభాస్.. భూమిపై మనుషుల్ని కాపాడే మిషన్ లో భాగమవుతాడని అంటున్నారు. మరి చూడాలో ఇందులో ఎంత నిజముందో? మరి ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ రీమేక్ అనే న్యూస్ పై మీరేం అంటారు? కింద కామెంట్ చేయండి.