మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లికి ముందుకంటే పెళ్లి తర్వాతే ఎక్కువగా ట్రోల్స్ కి గురైన సంగతి తెలిసిందే. పెళ్ళై కొన్నేళ్లు కూడా పూర్తవకముందే.. భర్తతో విడిపోయిందంటూ పుకార్లు, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోవడం, పబ్ లో నైట్ పార్టీ ఇష్యూ ఇలా ఇవన్నీ ఆమెపై ట్రోల్స్ రావడానికి కారణమయ్యాయి. తాజాగా నిహారిక సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యింది. ఇటీవలే తన భర్తతో కలిసి జోర్డాన్ ట్రిప్ కి వెళ్లిన ఫోటోలను షేర్ చేస్తూ సర్ప్రైజ్ చేసింది.
ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి నిహారిక ఫోటోలు ఇప్పుడే ఎందుకు వైరల్ అవుతున్నాయంటే.. తన భర్త చైతన్యతో కలిసి నిహారిక రొమాంటిక్ కిస్సింగ్ ఫోటో షేర్ చేయడమే. భర్త చైతన్యతో కలిసి నిహారిక లిప్ లాక్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే.. ఎప్పటికీ విడిపోని బంధం అంటూ కాప్షన్ జోడించి సర్ప్రైజ్ చేసింది. అయితే.. నిహారిక పోస్ట్ చేసిన రొమాంటిక్ ఫోటోలపై నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.
గత కొన్నిరోజుల క్రితం పబ్ కి సంబంధించి నైట్ పార్టీలో నిహారిక ఉండటం చర్చనీయాంశంగా మారిన సంగతి విదితమే. ఆ టైంలో నిహారికను పోలీసులు వదిలినప్పటికీ, నెటిజన్స్ మాత్రం ట్రోల్ చేయడం మానలేదు. ట్రోల్సింగ్ ఎక్కువ కావటంతో ఆమె ఇన్ స్టాగ్రామ్ నుంచి బయటకు వచ్చేసింది. వెంటనే నిహారిక భర్తతో విడిపోయిందంటూ పుకార్లు సృష్టించి ప్రచారం చేశారు. దానిపై మెగాబ్రదర్ నాగబాబు కూడా స్పందించారు.
తాజాగా నిహారిక మరోసారి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ అప్ డేట్స్ పోస్ట్ చేస్తోంది. అదీగాక ఇప్పుడు నిహారిక భర్తను ముద్దాడుతున్న ఫోటోపై పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ.. ట్రోల్స్ అన్నింటికీ చెక్ పెట్టేందుకే నిహారిక ఈ ఫోటోలు షేర్ చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే.. నిహారిక ఈ ఫొటో పెట్టడానికి కారణం.. తన భర్తకు తనకు మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని, ఇద్దరం ఎంతో హ్యాపీగా ఉన్నామని చెప్పడానికే సింపుల్ గా పిక్ పోస్ట్ చేసినట్లు సమాచారం. ఇక్కడ విశేషం ఏంటంటే.. నిహారిక సెకండ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడం. మరి నిహారిక పోస్ట్ చేసిన పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.