టీఆర్పీ రేటింగ్స్ కోసం టీవీ షో నిర్వాహకులు చేసే డ్రామాల గురుంచి అందరకి తెలిసిందే. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్.. ఇలా కామెడీ షో అయినా.. ‘ఎలానూ యూట్యూబ్ లో పెడతారుగా.. తరువాత తీరిగ్గా చోడొచ్చులే’ అని ప్రేక్షకులు అనుకోవడం సహజం. అయితే.. ప్రేక్షకులు ఇలా ఆలోచించకుండా.. షోకోసం ఎదురుచూసేలా ప్రోమోలో ఏదో ఉంది అన్నట్లు చూపటం.. షో నిర్వాహకుల ఆనవాయితీ. అదే ఇప్పుడు వారిని నెటిజన్ల చేత.. పిచ్చివారు అనేలా కామెంట్ చేసే స్థితికి తీసుకొచ్చింది.
అసలు విషయమేమిటంటే.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ‘ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదలైంది. ఇందులో హైపర్ ఆదిని రియల్ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు చూపించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రోమోలో ఇద్దరు పోలీసులు నానా హంగామా చేస్తారు. హైపర్ ఆది యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని ఆసుపత్రి పాలు చేశాడని, అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చామంటూ పోలీస్ స్టోరీ సినిమాలో సాయి కుమార్ రేంజ్ లో రెచ్చిపోయారు. అంతేకాదు తమకి ఎదురు మాట్లాడిన వాళ్ళని కొట్టినంత పని చేశారు. ఈ ప్రోమో చూశాక.. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చే ఆదివారం ఎపిసోడ్ కోసం కొందరు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలాంటి ప్రోమోలతో మమ్మల్ని నమ్మించలేరు, మా దగ్గర మీ పప్పులుడకవు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.‘యాక్సిడెంట్ చేసిన హైపర్ ఆది.. అరెస్ట్’ అంటూ ప్రోమో బాగానే కట్ చేశారు కానీ, అందులో పెద్ద లాజిక్ మర్చిపోయారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. “నిజానికి హైపర్ ఆదికి డ్రైవింగ్ రాదు. ఈ విషయాన్ని తనే పలు సందర్భాల్లో స్వయంగా చెప్పాడు”. ఆ వీడియో క్లిప్పులను నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. షో నిర్వాహకులను ఏకిపారేస్తున్నారు. అసలు డ్రైవింగ్ రాని వ్యక్తి యాక్సిడెంట్ ఎలా చేస్తాడు? అంటూ లాజిక్ తీస్తున్నారు. ఇంకా కొందరైతే “పోలీసు అన్నల యాక్టింగ్ బాగుంది.. సినిమాల్లో నటిస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. డ్రైవింగ్ రాని ఆది.. యాక్సిడెంట్ ఎలా చేశాడో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Jabardasth: జబర్దస్త్ షో లో బూతులపై అదిరే అభి షాకింగ్ కామెంట్స్