కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాల జోరు పెంచేశారు. కెరీర్లో చాలా గ్యాప్ తర్వాత ‘సన్ ఆఫ్ ఇండియా’తో అభిమానులను అలరించారు. ఇప్పుడు మోహన్ బాబు మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. అది కూడా కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి చేయడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఆ సినిమా టైటిల్ను `అగ్ని నక్షత్రం`గా ప్రకటించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై మంచు మోహన్బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఈ అగ్ని నక్షత్రం సినిమాకి ప్రీతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. సముద్రఖని, మలయాళ యాక్టర్ సిద్ధిక్, జబర్దస్త్ మహేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. విశ్వంత్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన వివరాలను చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డైమండ్ రత్నబాబు కథ సమకూర్చారు. పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న విభిన్నమైన చిత్రంగా చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకి ఎడిటర్గా మధురెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్గా లిజో కె జోష్, కెమెరామ్యాన్ గా గోకుల్ భారతి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉన్నట్లు చిత్రబృందం తెలిపింది. మోహన్ బాబు- మంచు లక్ష్మీ కాంబినేషన్లో రానున్న అగ్ని నక్షత్రం సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Today’s the day!
I am most excited to officially reveal the title of our movie: #Agninakshtram!
Want all your blessings🙏🏻@themohanbabu #PrateekPrajosh @thondankani @mynameisViswant @Chitrashukla73 @VrenThambidorai @Gemini4Suresh @bhimajiyanideep @PoornimaRamasw1 pic.twitter.com/fYAGo5fImR— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) July 1, 2022