సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం SSMB 28. మహేష్ బాబు ఇంట్లో జరిగిన విషాదాల కారణంగా గత కొంత కాలం ఈ సినిమా షూటింగ్ వాయిదాలు పడింది. అనంతరం శరవేగంగా సూపర్ స్టార్ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే? ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను భారీ ధరకు కోనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ. ఓ తెలుగు సినిమాను ఇంత పెద్ద మెుత్తంలో.. అదీ సినిమా రిలీజ్ కాకముందే కొనుగోలు చేయడం ఓ రికార్డు అనే చెప్పాలి.
SSMB 28.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, పూజా హెగ్డే, శ్రీలీల, జగపతి బాబు లు ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న సినిమా. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హాసిని అండ్ హారికా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలు చోటుచేసుకోవడంతో.. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సంఘటనలతో పాటుగా స్క్రీప్ట్ రీ రైట్ చేసి.. ప్రస్తుతం అన్ని అడ్డంకులను దాటుకుని శరవేగంగా SSMB 28 సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేంటంటే? ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకుంది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ల్స్. దక్షిణ భారత భాషలు అయిన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయడానికి ఏకంగా రూ. 80 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను నెట్ ఫ్లిక్స్ తన ట్వీటర్ లో షేర్ చేసింది. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. హిందీ హక్కులను మాత్రం ఏ సంస్థా కొనుగోలు చేయకపోవడం.
Penu thuphaanu thalonchaina choodaataniki memu ready. Meeru?#SSMB28 is coming on Netflix in Telugu, Tamil, Malayalam and Kannada as a post theatrical release! 🤩#NetflixLoEmSpecial #NetflixPandaga #SSMB28 pic.twitter.com/34teGAQz2m
— Netflix India South (@Netflix_INSouth) January 14, 2023
దానికి కూడా ఓ కారణం ఉంది. SSMB 28 చిత్రం తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఓ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. హాలీవుడ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహకాలు చేస్తున్నాడు జక్కన్న. ఇక ఈ చిత్రంతోనే సూపర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని సమాచారం. దాంతో ఓటీటీ హక్కులపై సంధిగ్దత ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ఏ సినిమా దక్కించుకోని రికార్డు ధరను దక్కించుకొని మహేష్ బాబు రికార్డు క్రియేట్ చేశాడు. సినిమా రిలీజ్ కాక ముందే ఓటీటీ హక్కులను ఇంత భారీ ధరతో కొనుగోలు చేయడం టాలీవుడ్ లో ఓ చరిత్ర అనే చెప్పాలి. మరి అలాంటి చరిత్రను క్రియేట్ చేసిన మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.