చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలతో పాటు వ్యాపార రంగంలోను ప్రవేశిస్తుంటారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు ఇతర బిజినెస్ లు చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ హీరో కూడా కొత్త బిజినెస్ ప్రారంభించాడు.
చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలతో పాటు వ్యాపారా రంగంలోను ప్రవేశిస్తుంటారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు ఇతర బిజినెస్ లు చేస్తుంటారు. అలానే కొందరు సినిమాల్లోనే నటిస్తూ మరొకవైపు ఉద్యోగాలు చేస్తుంటారు. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చాలా మంది హీరో, హీరోయిన్లు వివిధ వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ స్టార్ హీరో కూడా కొత్త బిజినెస్ ను ప్రారంభించాడు. మరి.. ఈ హీరో ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళ స్టార్ హీరో అజిత్.. గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన ప్రపంచమే సెపరేటు అన్నట్లుగా జీవన శైలిని మార్చుకున్న అతి కొద్ది మంది నటుల్లో అజిత్ ఒకరు. ఎన్నో సినిమాలో తన నటించి.. ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇక సినిమాలంటే అజిత్ కి ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే ఫోటోగ్రఫీ, బైక్, కార్ రేసింగ్ వంటి వాటిపై కూడా ఆసక్తి ఉన్న విషయం తెలిసిందే. గతంలో బైక్ పై దేశంలో ప్రధాన నగరాలను సందర్శించాడు.
ఇటీవలే భూటాన్, నేపాల్ నగరాల్లో బైక్ పై టూర్ కి ముగించుకుని చెన్నై తిరిగి వచ్చారు. అయితే అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఆయన అనేక విషయాలను వెల్లడించారు. అలానే ఓ వ్యాపార సంస్థను ప్రారంభిస్తున్న విషయం కూడా తెలిపారు. జీవితం అనేది ఒక అందమైన ప్రయాణమని, అందులోని మలుపులను, తెరచిన మార్గాలను అనుభవించాలని ఆయన పేర్కొన్నారు. తాను స్వదేశీ, విదేశీ బైక్ రైడింగ్ తో చేసే విహార యాత్రను ఒక వృతిగా మార్చే ప్రయత్నం చేశానన్నారు.
ఏకే మోటో రైడ్ పేరుతో మోటార్ సైకిల్ విహారం యాత్ర సంస్థను ప్రారంభించినట్లు అజిత్ తెలిపారు. దీని ద్వారా దేశంలోని , అలానే ప్రపంచంలోని ప్రకృతి అందాలను, రోడ్లపై ప్రయాణం చేయాలన్న ఆసక్తిని కనబరచేవారికి ఏకే మోటో రైడ్ సంస్థ సహకరిస్తుందన్నారు. అలాంటి వారికి తగిన జాగ్రత్తలతో పాటు సౌకర్యవంతమైన మోటార్ బైక్లను సమకూర్చడం జరుగుతుందన్నారు. మరి.. అజిత్ ప్రారంభించిన ఈ కొత్త బిజినెస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.