జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ పొందిన కమెడియన్స్ లో కిరాక్ ఆర్పీ ఒకరు. ఈయన పూర్తిపేరు రామ్ ప్రసాద్,.. కాగా షార్ట్ కట్ లో ఆర్పీ అని పెట్టుకున్నాడు. జబర్దస్త్ లో వందల స్కిట్స్ చేసిన ఆర్పీ.. జబర్దస్త్ నుండి మెగా బ్రదర్ నాగబాబు వెళ్ళిపోయాక ఆర్పీ కూడా వెళ్ళిపోయాడు. ఇక జబర్దస్త్ తర్వాత సినిమా డైరెక్షన్ లోకి దిగి ఓ సినిమా తీసే ప్రయత్నం చేశాడు. కానీ, ఆ సినిమా ఎవరితో, ఏంటి? అనే వివరాలు ఇప్పటివరకు బయటికి రాలేదు. ఆ తర్వాత మళ్లీ నాగబాబు జడ్జిగా వ్యవహరించిన కామెడీ స్టార్స్ షోలో రీఎంట్రీ ఇచ్చాడు. అంతలోనే తాను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం, పెళ్లి టాపిక్స్ తో వార్తలలో నిలిచాడు.
ఇక జబర్దస్త్, కామెడీ స్టార్స్ లాంటి టీవీ షోలకు గుడ్ బై చెప్పిన తర్వాత ఆర్పీ.. పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. ఆ తర్వాత జబర్దస్త్ షోపై పలు వివాదాస్పద కామెంట్స్ కూడా చేశాడు. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా ఆర్పీ రెస్టారెంట్ బిజినెస్ లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. కూకట్ పల్లిలోని మంజీరా వాటర్ ట్యాంక్ ఎదురుగా ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ పేరుతో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేసాడు ఆర్పీ. ఈ రెస్టారెంట్ ని వైజాగ్ సత్యానంద్ చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించడం విశేషం. ప్రస్తుతం ఆర్పీ కొత్త రెస్టారెంట్ కి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో తాను స్టార్ట్ చేసిన నెల్లూరు పెద్దారెడ్డి రెస్టారెంట్ ప్రత్యేకతల గురించి ఆర్పీ మాట్లాడుతూ.. ఈ రెస్టారెంట్ లో అన్ని వంటకాలు కట్టెల పొయ్యిపై మాత్రమే వండుతామని.. పదేళ్ల కిందట మొదలు పెడదామనుకున్న రెస్టారెంట్ కల ఇప్పటికి నెరవేరిందని చెప్పాడు. అయితే.. ఈ రెస్టారెంట్ లో ఆర్పీతో పాటు సత్తెన్న కూడా భాగస్వామిగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆర్పీ వెల్లడించాడు. ఇదిలా ఉండగా.. కిరాక్ ఆర్పీది నేటివ్ ప్లేస్ నెల్లూరు అని తెలిసిందే. నెల్లూరు చేపల పులుసు అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆ రుచిని హైదరాబాద్ వాసులకు అందించాలని భావిస్తున్నట్లు ఆర్పీ తెలిపాడు. మరి కిరాక్ ఆర్పీ రెస్టారెంట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.