సాధారణంగా ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే చాలు.. మామూలు జనాలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా కొత్త వస్తువులు, ఖరీదైన కార్లు కొనుగోలు చేస్తుండటం చూస్తుంటాం. అయితే.. సెలబ్రిటీలు కూడా సమయం సందర్భం వచ్చినప్పుడే వారికి ఇష్టమైనవి కొంటుంటారు. ఇటీవల దసరా సందర్భంగా హీరోయిన్ కీర్తిసురేష్ కొత్తగా లగ్జరీ బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. కీర్తిసురేష్ బీఎండబ్ల్యూలో కొత్త మోడల్ ఎక్స్7 సిరీస్ తీసుకుందట. అయితే.. ప్రస్తుతం కీర్తి కొత్త కారుకి పూజ చేస్తుండటం.. కారులో తన పెట్ తో డ్రైవ్ కి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో కీర్తి కొన్న కారులో ప్రత్యేకతలు ఏమున్నాయి.. సెలబ్రిటీలు కార్లు కొనడం అనేది మామూలే కదా అనుకుంటున్నారు నెటిజన్స్. నిజానికి కీర్తి సురేష్ కి కార్లంటే ఎక్కువ ఇష్టమట. ఇప్పటికే ఆమె దగ్గర వేరే లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు ఫోటోలలో చూస్తే తెలుస్తుంది. అయితే.. కీర్తి కొత్తగా తీసుకున్న కారు విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ ఎక్స్7 సిరీస్ కారు బ్లూ కలర్ లో చాలా రాయల్ గా కనిపిస్తోంది. ఈ కారు ధర మార్కెట్ లో రూ. 1.18 కోట్ల నుండి రూ. 1.80 కోట్ల వరకు ఉంటుందట. అదీగాక 7 సీటర్ కార్లలో బీఎండబ్ల్యూనే బాగా ప్రాచుర్యం పొందింది. దీనిలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కొత్త iDrive సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రిస్టల్-ఎఫెక్ట్ గేర్ లివర్ మరియు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. కీర్తి సురేష్ ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరుకి చెల్లిగా భోళాశంకర్.. నాని సరసన దసరా సినిమాలలో నటిస్తోంది. అయితే.. కీర్తి ఎన్ని సినిమాలు చేసినా, ఆమెకు నటిగా గుర్తింపు, నేషనల్ అవార్డు తీసుకొచ్చింది మాత్రం మహానటినే. ఇప్పటికి కీర్తి సురేష్ అనే పేరుకంటే.. మహానటి అంటేనే నార్మల్ ఆడియెన్స్ గుర్తుపడుతుంటారు. మహానటి క్యారెక్టర్ ద్వారా అంతలా జనాలకు దగ్గరైంది ఈ చెన్నై బ్యూటీ. అటు తమిళం, ఇటు తెలుగు సినిమాలతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న కీర్తి.. ఈ మధ్యే గ్లామరస్ గా కనిపించేందుకు ట్రై చేస్తోంది. చూడాలి మరి మున్ముందు మహానటి ఎలాంటి సినిమాలతో ఆకట్టుకోనుందో!