ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఆ ఇంటా, ఈ ఇంటా, ఆ నోటా, ఈ నోటా ఎవరి నోట విన్నా నాటు నాటు పాటే.. ఎవరి ఇంట చూసినా నాటు నాటు పాటే. ఏ సోషల్ మీడియాలో చూసినా నాటు నాటు స్టెప్పులే. అంతలా ఈ నాటు సరుకు.. సారీ నాటు పాట జనాల్లో పాతుకుపోయింది. మన తెలుగోళ్లు మాత్రమే కాదు.. భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ ఏ పాటని ఎంజాయ్ చేశారు. ఎల్లలు దాటి మరీ ఈ పాట సరిహద్దుల్ని చెరిపివేసింది. ప్రపంచమంతా ఉన్న సినీ ప్రేమికులను పూనకాలతో ఊగిపోయేలా చేసింది. నాటు అంటేనే లోకల్. లోకల్ పాట అంటే నికార్సైన పాట. అందుకే ఈ పాటకి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది.
ఈ పాటకు అవార్డు రావడంపై ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు దేశం మొత్తం గర్వించే విషయమని బృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. మోదీ, సీఎం జగన్, చంద్రబాబు నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. తమకి అభినందనలు తెలియజేసిన మోదీకి, జగన్ కి, చంద్రబాబు నాయుడికి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబుకి థ్యాంక్యూ మావయ్య అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ కూడా నాటు నాటు పాటకి అవార్డు రావడంపై ప్రశంసల జల్లు కురిపించారు.
‘తెలుగు జెండా రెపరెపలాడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల తరపున, నా తరపున.. ఎం.ఎం. కీరవాణి, ఎస్.ఎస్. రాజమౌళి, తారక్, రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. మీ గురించి చాలా గర్వపడుతున్నాము’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. జగన్ ట్వీట్ కి ఎన్టీఆర్ సమాధానమిస్తూ.. ‘థాంక్యూ సార్’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Thank you Sir.
— Jr NTR (@tarak9999) January 11, 2023