జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే.. మన మూలాలను మర్చిపోవద్దు.. మనకు సాయం చేసిన వాళ్లను జీవితాంతం గుర్తుంచుకోవాలి అంటారు పెద్దలు. ఈ మాటలను అక్షరాల ఆచరించి చూపారు కీరవాణి. ఇక ఆయన చేసిన కామెంట్స్పై ఆర్జీవీ రిప్లై ఇవ్వడం వైరల్గా మారింది. ఆ వివరాలు..
'ఆర్ఆర్ఆర్' పాటకు ఆస్కార్ గెలుచుకోవడం ఏమో గానీ ఈ సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ అవార్డు రావడానికి తానే కారణమని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఆస్కార్ ఈవెంట్ కి వెళ్ళడానికి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ఫ్రీ ఎంట్రీ లేదా? కీరవాణి, చంద్రబోస్ లకు ఫ్రీ పాస్ లు ఇచ్చారు గానీ మిగతా వారికి ఇవ్వలేదు. దీంతో లక్షలు ఖర్చు పెట్టి ఆస్కార్ ఈవెంట్ టికెట్లు కొనుక్కోవాల్సి వచ్చిందట.
ఎప్పుడూ కచ్చితమైన విజన్ తో ముందుకు వెళ్లే జక్కన్న.. ఈసారి కూడా తన విజన్ తో ముందుకెళ్లి ఆస్కార్ ను ఒడిసిపట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి ఆస్కార్ ప్రమోషన్స్ కు ఖర్చు పెట్టిన ప్రతీ పైసా రాబట్టే పనిలో ఉన్నాడు. మరి అన్ని కోట్లు రాజమౌళి ఎలా రాబట్టాలని చూస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
పూనకాలు తెప్పించే ఒక పాట వస్తుంటే మనుషులు డ్యాన్స్ వేయకుండా ఉండలేరు. అయితే వస్తువులతో కూడా డ్యాన్స్ చేయించే వారు ఉంటారు. అంటే బీట్ కి తగ్గట్టు వస్తువుల మూమెంట్స్ ని సింక్ చేస్తారు. తాజాగా వందకు పైగా కార్లు నాటు నాటు పాటకు డ్యాన్స్ చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ సాధించి ఇండియా మొత్తం గర్వపడేలా చేసింది. 'నాటు నాటు' పాటకు దేశంతో పాటు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆడిపాడారు. ముఖ్యంగా నాటు నాటు హుక్ స్టెప్ కి బీభత్సమైన క్రేజ్ పెరిగింది. ఆస్కార్ సాధించిన మొదటి తెలుగు పాటగా నాటు నాటు హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే.. అందరూ నాటు నాటు సాంగ్ చూసి ఎంజాయ్ చేసి.. విజిల్స్ వేశారు. కానీ.. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గురించి పెద్దగా మాట్లాడుకోలేదు.
చరణ్, ఎన్టీఆర్ ల వల్లే స్టార్ హీరోయిన్ కొడుకు అన్నం తింటున్నాడా? ఏ ఆ హీరోయిన్ దగ్గర బియ్యం, పప్పులు, ఉప్పు కొనుక్కోవడానికి డబ్బు లేదా? అని అనకండి. ఆమె అపర కోటీశ్వరురాలు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. తరగనంత ఆస్తి ఉంది.. కానీ తన కొడుకు అన్నం తినడానికి చరణ్, ఎన్టీఆర్ లు కావాల్సి వచ్చింది. చరణ్, ఎన్టీఆర్ లు కనబడితేనే అన్నం తింటానని స్టార్ హీరోయిన్ కొడుకు మారాం చేస్తున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు?
ఆసీస్ తో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ కోహ్లీ తనలో ఉన్న డ్యాన్సర్ ను మరోసారి అభిమానులకు చూపించాడు. ఆస్కార్ కొల్లగొట్టిన నాటునాటు పాటకు మ్యాచ్ మధ్యలోనే స్టెప్పులు వేశాడు కోహ్లీ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సంగీత దర్శకుడు కీరవాణి ఎప్పుడూ కూల్గా కనిపిస్తారు. ఆయన తనలోని భావోద్వేగాలను బయటకు చూపించరు. కానీ ఒక వీడియో చూశాక మాత్రం.. కీరవాణి కన్నీళ్లు ఆపుకోలేకపోయారట. అసలు ఏంటా వీడియో, దాని కథాకమామీషు ఏంటనేది తెలుసుకుందాం..