పాపం ఉత్తరకొరియా ప్రజలు! ఆ దేశ అధ్యక్షుడు కిమ్ తీసుకున్న మరో నిర్ణయం దెబ్బకు తెగ బాధపడుతున్నారు. నెటిజన్స్ అయితే ఇదెక్కడి డెసిషన్ రా మావ అని మాట్లాడుకుంటున్నారు.
ఉత్తరకొరియా అనగానే దాదాపు ప్రతిఒక్కరికి గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ నేమ్ కిమ్. అధ్యక్షుడిగా అతడు తీసుకునే నిర్ణయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఆ దేశంలో ఉండే ప్రజల గురించి బయటవాళ్లకు తెలియదు. మన గురించి ఆ దేశ ప్రజలకు తెలిసే ఛాన్సే లేదు. దీనంతటికి కారణం కిమ్ జోంగ్ ఉన్ నిరంకుశ పాలన. ఈ దేశంలో ప్రజలు చాలా ఆంక్షల మధ్య బతుకుతుంటారు. కిమ్ ఏది చెబితే అక్కడ అదే శాసనం. ఒకవేళ మీరు పొరబాటున రూల్ అతిక్రమిస్తే చంపేయడానికైనా సరే అస్సలు వెనుకాడరు. నిత్యం సంచలన నిర్ణయాలు తీసుకునే కిమ్.. ఇప్పుడు అంతకు మించిన ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.
ఇక విషయానికొస్తే.. ఉత్తరకొరియా ప్రెసిడెంట్ కిమ్ దృష్టి ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలపై పడింది. ఈ సినిమాల ప్రభావంతో ఎవరైనా తిరుగుబాటు చేస్తారనే అనుమానంతో ఏకంగా ఆయా చిత్రాలు, సిరీసులపై నిషేధం విధించాడు. హాలీవుడ్ లేదా విదేశీ సినిమాలు చూస్తూ దొరికితే ఆ పిల్లల తల్లిదండ్రులను ఏకంగా జైలుకు పంపిస్తామని ప్రకటన చేశాడు. మొదటి తప్పుగా పేరెంట్స్ ని కార్మిక శిబిరాలకు పంపించి అక్కడ ఆరు నెలల పాటు ఉంచుతారు. పిల్లలని మాత్రం ఐదేళ్ల జైలుశిక్ష విధించి, ఆ తర్వాత శిబిరాలకు పంపుతారు.
ఈ విషయంలో ఉత్తరకొరియా అధికారుల వాదన మాత్రం వేరేలా ఉంది. పిల్లలకు తల్లిదండ్రులు.. దేశ విశిష్టత గురించి తెలియజేయాలని, అలా చేయకపోతే వాళ్లు సామ్యవాద వ్యతిరేకులుగా మారే ప్రమాదముందని అంటున్నారు. ఇదిలా ఉండగా గతంలో దక్షిణా కొరియా సినిమా క్యాసెట్లతో దొరికిన ఇద్దరు పిల్లల్ని చంపేశారనే కథనాలు వచ్చాయి. దీంతోపాటు ఎవరైనా సరే ఉత్తరకొరియాలో అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు తెలిస్తే.. కాల్చి చంపేయాలని గతనెలలోనే ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ చూస్తున్న సగటు సినీ ప్రేక్షకుడు.. ఉత్తరకొరియా ప్రజల పరిస్థితి చూసి జాలి పడుతున్నారు. మరి కిమ్ తీసుకున్న నిర్ణయంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.