గణేశ్ మాస్టర్.. పక్కా పవన్ కళ్యాణ్ అభిమాని. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి పైకొచ్చారు గణేశ్ మాస్టర్. కానీ.. తనలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, సమాజంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నా ఆయన చాలా త్వరగా రియాక్ట్ అయిపోతుంటారు. చాలా ఎమోషనల్ అయిపోతుంటారు. ఈ విషయాన్ని లైవ్ గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ డ్యాన్స్ షోకి కొన్ని రోజులుగా గణేశ్ మాస్టర్ గెస్ట్ గా వస్తున్నారు. శేఖర్ మాస్టర్ స్థానంలో వచ్చిన ఆయన ఆ ఇంప్యాక్ట్ ఏ మాత్రం తగ్గకుండా షోని నడిపిస్తున్నారు. అయితే.., ఆ షోలో ఏ డ్యాన్సర్ కష్టంలో ఉన్నా ఆదుకోవడం గణేశ్ మాస్టర్ కి అలవాటు అయిపోయింది. అంత మంచి మనసు ఆయనది. ఇక తాజాగా ఢీ-13 లో ‘కింగ్స్ వర్సెస్ క్వీన్స్’ ఛాలెంజ్ నడించింది. ఈ ఎపిసోడ్ లో టీమ్లీడర్లు, జడ్జీలు కూడా స్టేజీ మీద అదరగొట్టే పెర్ఫార్మెన్సులు ఇచ్చినట్టు ప్రోమోలో తెలుస్తోంది. ఇక కంటెస్టెంట్ సాయి ‘వకీల్సాబ్’లో ‘జనగణమన’ పాటకు పర్ఫార్మెన్స్ ఇచ్చి.., ఆడపిల్లలపై జరిగే దుర్మార్గాలను కళలకు కట్టినట్టు చూపించి అందరితో కన్నీళ్లు పెట్టించాడు.
స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన గణేశ్ మాస్టర్ సాయి పెర్ఫార్మెన్స్ చూసి తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. “నిజ జీవితంలో జరుతుగుతున్నదే వకీల్ సాబ్ లో చూపించారు. అరేయ్ ల** కొడకల్లారా చిన్న పిల్లల్లో ఏమి కనిపిస్తుందిరా? వాళ్ళని కూడా వదలడం లేదు” అంటూ గణేశ్ మాస్టర్ స్టేజ్ పైనే ఏడ్చేశారు. పక్కనే ఉన్న ప్రియమణి, పూర్ణ ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఆది, రష్మి కూడా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రోమోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.