నగరి వైసీపీ ఎమ్మెల్యే RK రోజాకు భారీ షాక్ తగిలింది. ఆమె భర్త RK సెల్వమణిపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పరువు నష్టం కేసులో సెల్వమణి కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయనపై ఈ వారెంట్ జారీ అయ్యింది. ఆ వివరాలు.. ప్రముఖ దర్శకుడు, దక్షిణభారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడు RK సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ చెన్నై జార్జిటౌన్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: రాయలసీమకు సముద్రం.. MLA రోజా ట్వీట్ వైరల్!
2016లో సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఇద్దరు ఓ టీవీ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో వీరిద్దరు ఫైనాన్షియర్ ముకుంద్చంద్ బోద్రా గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. సెల్వమణి, అన్బరసు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముకుంద్చంద్ బోద్రా వారిద్దరిపై జార్జిటౌన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
ఇది కూడా చదవండి: షాకింగ్: జబర్దస్త్ జడ్జీ పోస్ట్ నుంచి రోజా అవుట్!
బోద్రా మృతి చెందాక.. ఈ కేసును అతని కుమారుడు గగన్ బోద్రా కొనసాగిసుత్న్నారు. ఈ క్రమంలో ఈ కేసు మంగళవారం విచారణకు రాగా.. సెల్వమణి, అరుళ్ అన్బరసులు కోర్టుకు హాజరుకాలేదు. వారి తరఫు న్యాయవాదులు కూడా కోర్టుకు రాలేదు. ఈ క్రమంలో జార్జిటౌన్ న్యాయమూర్తి వారిద్దిరిపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ.. తదుపరి విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేశారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.