నటిగా తెలుగు ఇండస్ట్రీలో ఫేమ్ కానప్పటికీ, తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ట్రోఫీ అందుకొని సర్ప్రైజ్ చేసింది బిందు మాధవి. ఈ ముప్పై ఐదేళ్ల మదనపల్లి బ్యూటీ.. నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 14 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. కానీ.. ఇంతవరకూ ఇటు తెలుగులో, అటు తమిళంలో క్లిక్ అవ్వకపోవడం గమనార్హం. అయితే.. 2011లో పిల్ల జమీందార్ సినిమాలో చివరిసారిగా కనిపించింది బిందు. ఆ తర్వాత పూర్తిగా తమిళ ఇండస్ట్రీకే పరిమితమైంది.
తమిళంలో వరుసగా అందరి హీరోల సరసన సినిమాలు చేసింది కానీ తగిన గుర్తింపు, క్రేజ్ పొందలేకపోయింది. ఇక ఎట్టకేలకు పదేళ్ల తర్వాత బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమైంది. బిగ్ బాస్ ఆటలో చురుకుగా ఉంటూ.. తెలివైన ఆటతీరుతో ప్రేక్షకుల మనసు దోచుకొని.. ఫ్యాన్స్ ని కూడా సంపాందించుకుంది. హౌస్ లో చివరివరకూ అందరికీ గట్టి పోటీనిచ్చి.. విజేతగా నిలిచింది. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో విజేతగా నిలిచిన లేడీ కంటెస్టెంట్ గా బిందు క్రేజ్ దక్కించుకుంది.
ఇదిలా ఉండగా.. మామూలుగా హీరోయిన్ల వయసు ముప్పై దాటితేనే పెళ్ళెప్పుడు.. ఇంకాపెళ్లి చేసుకోలేదా అని ప్రశ్నిస్తుంది సమాజం. అలాంటిది బిందు మాధవి వయసు ఏకంగా 35 దాటి 36కి పరుగులు పెడుతోంది. అలాగే బిగ్ బాస్ విన్నర్ అయ్యింది. మరి ఇప్పుడైనా పెళ్లి కబురు చెబుతుందేమో అనుకుంటే.. సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలిపింది. సరే కనీసం బిందు మాధవి పెళ్లి గురించి ఆమె తండ్రిని అడగ్గా.. ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “బిందుని ఇదివరకు పెళ్లి గురించి ప్రెషర్ చేశా. కానీ ఆమె అభిప్రాయం విన్నాక ఏమి అనలేదు” అంటూ వారి మధ్య జరిగిన సంభాషణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బిందు మాధవి తండ్రి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి బిందు మాధవి పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.