నిఖిల్ సిద్ధార్థ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన అడ్వంచర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ కార్తికేయ 2. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్లో సైతం ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్లో మొదటి రోజు తక్కువ థియేటర్స్కి పరిమితమైన ఈ సినిమా మరుసటి రోజు నుండి థియేటర్స్ని పెంచుకుంటూ భారీ వసూళ్ళను రాబడుతుంది. బాలీవుడ్లో అయితే మొదటి రోజు కేవలం 50 షోలతో మొదలైన ఈ సినిమా 3 వేలకు పైగా షోలతో దూసుకుపోతుంది. శ్రీ కృష్ణుడి బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా విమర్శల ప్రసంశలు అందుకుంటుంది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాని చూసి మంచి సినిమా అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఒక గొప్ప సినిమాని చూసిన ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు.
నిఖిల్, చందూ మొండేటి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ఈ సినిమాపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసల జల్లు కురిపించారు. చందూ మొండేటిని తన ఇంటికి పిలిచి మరీ అభినందనలు తెలియజేశారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు చందూ మొండేటి. “ఆయన ఆశీర్వాదాలు.. జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు అని, ధన్యవాదాలు అమితాబ్ బచ్చన్ జి” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి చందూ మొండేటి కార్తికేయ 2 సినిమాతో పానిండియా దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ల కళ్ళలో పడ్డాడు. త్వరలోనే బాలీవుడ్ ప్రాజెక్ట్ చేపట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చందూ మొండేటి, అమితాబ్ బచ్చన్ని కలవడంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.