ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరీ ఆకస్మిక మరణం నందమూరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఉమా మహేశ్వరీ మరణాన్ని ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పాటు సోదరులు కూడా భరలించలేకపోతున్నారు. మరోవైపు సోదరి మరణవార్త విని హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకున్న బాలకృష్ణ.. దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. ఇక బాలకృష్ణ తన ఫ్యామిలీతో పాటు దగ్గరుండి సోదరి చివరి అంత్యక్రియలను చూసుకుంటున్నారు.
ఉమామహేశ్వరికి నివాళులు అర్పించేందుకు నందమూరి ఫ్యామిలీ, సినీ, రాజకీయ ప్రముఖులు జూబ్లీహిల్స్ లోని ఆమె ఇంటికి తరలివస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, దుగ్గుబాటి పురందేశ్వరి, దుగ్గుబాటి వెంకటేశ్వరరావు, గారపాటి లోకేశ్వరి, నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ సతీమణి వసుంధర, నందమూరి కల్యాణ్రామ్, నారా లోకేష్, తదితరులు ఆమెకు నివాళులర్పించారు. ఈ క్రమంలో బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి సోదరి పాడెను మోశారు. ఆమె అంత్యక్రియలను ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో జరపనున్నారు.
ఇదీ చదవండి: NTR కుమార్తె ఉమా మహేశ్వరి చివరి చూపుకు Jr. NTR వస్తాడా?