‘ఈరమాన రోజావే’ అనే తమిళ సినిమాతో హీరోయిన్గా అడుగుపెట్టిన మోహిని.. బాలకృష్ణ సరసన ఆదిత్య 369 సినిమాలో నటించారు. ఆ తర్వాత మోహన్బాబు హీరోగా వచ్చిన ‘డిటెక్టివ్ నారదా’, రాజేంద్రప్రసాద్ నటించిన ‘మామ బాగున్నావా’ సినిమాల్లో నటించారు. చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ మూవీలో చిరు సోదరిగా మోహిని నటించారు. తెలుగులో తక్కువ సినిమాలు చేసిన మోహిని, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రం చాలా సినిమాల్లో నటించారు. తమిళనాడుకి చెందిన ఈ గాజు కళ్ళ హీరోయిన్ అసలు పేరు మహాలక్ష్మి శ్రీనివాసన్. మోహినిగా సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 100 సినిమాల్లో నటించిన ఈమె ఆఖరి సినిమా కలెక్టర్. మలయాళ భాషలో తెరకెక్కిన ఈ సినిమా 2011లో రిలీజైంది.
ఆ తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకి టాటా చెప్పేశారు. భరత్ కృష్ణస్వామి అనే బిజినెస్మ్యాన్ను 1999లో వివాహం చేసుకున్న ఈమె అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి రుద్రకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు. పుట్టుకతో హిందువు అయిన భరత్ ఆ మధ్య క్రైస్తవ మతాన్ని స్వీకరించడంతో మోహిని కూడా క్రైస్తవురాలిగానే జీవించారు. కొన్ని రోజుల తర్వాత విబేధాల కారణంగా మోహిని తన భర్త నుండి విడిపోయారు. ఆ తర్వాత కూడా ఆమె క్రైస్తవ మతంలోనే ఉంటూ.. క్రైస్తవ మత బోధకురాలిగా ఎదిగారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో జీవిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.