డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి మనకి తెలిసిందే. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తీసి... తెలుగు ప్రేక్షకుల మది ప్రత్యేక స్ధానం సంపాదించుకున్నాడు. ఇకపోతే పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఛార్మీ, పూరీలపై ఎప్పటి నుంచో పలురకాల వార్తలు వినిపిస్తోన్నాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి కొందరు వీరి మధ్య ఏదో ఉందని రూమర్స్ ప్రచారం చేశారు. పూరితో ఉన్న ఫ్రెండ్సషిప్ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్ షిప్ ను పూరీ జగన్నాథ్ బయటపెట్టారు. పూరీ, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఈ సినిమా నిర్మాతల్లో ఛార్మీ ఒకరు. ఆగస్టు 25 ఈ సినిమా విడుదలై కానుంది. లైగర్ టీమ్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఛార్మీతో తనకున్న రిలేషన్ షిప్ గురించి స్పందించారు. పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. "ఛార్మీ చాలా చిన్న వయస్సులో ఉన్నప్పటి నుంచి ఆమె నాకు తెలుసు. కొన్ని ఏళ్ల నుంచి ఛార్మితో కలిసి పని చేస్తున్నాను. ఛార్మీకి నాకు ఏదో అఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అదే ఛార్మికి 50ఏళ్లు ఉంటే ఎవరూ ఇలా మాట్లాడేవారు కాదు. ఒకవేళ ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగి ఉంటే కూడా మా మధ్య ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసే వాళ్లు కాదు. కానీ తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా కలిసి ట్రావెల్ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ నిజంగా అఫైర్ ఉన్నా అది ఎక్కువరోజులు నిలబడదు. ఆకర్షణ అనేది అశాశ్వతం. అది కొన్ని రోజూలోనే చచ్చిపోతుంది. స్నేహం మాత్రం శాశ్వతం. తామిద్దరం మంచి ఫ్రెండ్స్" అని తమపై వస్తున్న పుకార్లకు పూరి జగన్నాథ్ ఫుల్ స్టాప్ పెట్టారు. మరి.. పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: వీడియో: పాయల్ రాజపుత్ డ్రెస్సింగ్ పై హీరో సుధీర్ ఫన్నీ కామెంట్! ఇదీ చదవండి: ‘సీతారామం’ని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు..