ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ప్రవేశించి.. మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి.. స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పటి వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు చిరంజీవి. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. వందల రూపాయలతో కెరీర్ ప్రారంభించిన చిరంజీవి.. ప్రస్తుతం టాలీవుడ్లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఇక హైదరాబాద్లో ఆయనకు పలు ప్రాంతాల్లో ఖరీదైన భూములు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం చిరంజీవికి సంబంధించిన ఓ వార్త నెట్టింట బాగా వైరలయ్యింది. అదేంటంటే.. చిరంజీవి హైదరాబాద్లో ఉన్న అత్యంత విలువైన స్థలాన్ని అమ్మేశారనే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ దినపత్రిక యజమాని ఒత్తిడి మేరకు చిరంజీవి ఆ స్థలం అమ్మారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తల్లో కొంత మేర అసత్య ప్రచారం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి స్థలం అమ్మడం వరకు నిజమే.. కానీ ఎవరో ఒత్తిడి మేరకు ఆయన స్థలం అమ్మలేదు. ప్రస్తుతం అమ్మిన స్థలాన్ని చిరంజీవి కెరీర్ ప్రారంభంలో చాలా తక్కువ ధరకే కొన్నారు. నేడు దాని విలువ భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఫినిక్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ.. చిరంజీవిని సంప్రదించి.. భారీ ఆఫర్ ఇవ్వడానికి అంగీకరించడంతో.. చిరంజీవి.. స్థలం అమ్మినట్లు తెలిసింది. కానీ కొన్ని మీడియా, సోషల్ మీడియా గ్రూపుల్లో మాత్రం.. పత్రిక యజమాని ఒత్తిడి మేరకే చిరంజీవి ల్యాండ్ అమ్మారంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ అవన్నీ అవాస్తవాలే అని తేలింది. ఈ స్థలం అమ్మకం వ్యవహారం ఇదర్దరి అంగీకరంతోనే.. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా.. స్నేహపూర్వక వాతావరణంలో పూర్తయిందని తెలిసింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంస్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: హీరో వెంకటేష్ కుటుంబానికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట! ఇదీ చదవండి: 5వ రోజూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మోత మోగించిన కార్తికేయ 2..!